ఇన్సోసిస్ క్యూ2: 28.6 శాతం పెరిగిన నికరలాభం
హైదరాబాద్: 2014-15 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) ఫలితాల్లో భారత్ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ మార్కెట్ అంచనాలను అధిగమించింది. రెండో క్వార్టర్ ఫలితాల్లో 3096 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకుంది.
రెండో త్రైమాసికంలో 2.9 శాతం వృద్దితో ఇన్సోసిస్ రూ. 13,342కోట్ల ఆదాయం లభించింది. గత వార్షిక ఆదయంతో పోల్చుకుంటే వృద్ది రేటు 28.6 శాతం పెరిగింది. దీంతో భారత్ స్టాక్ మార్కెట్లలో ఇన్పోసిస్ కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది.

శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లో ఇన్సోసిస్ 6.65 శాతం లాభంతో 3888 వద్ద ట్రేడ్ అవుతుంది. సిటీ గ్రూప్ డౌన్ రేటింగ్తో కొన్ని రోజులుగా సర్దుబాటుకు గురైన ఇన్పోసిస్ రెండో త్రైమాసిక ఫలితాలతో భారీ లాభాలను ఇన్వెస్టర్లకు పంచుతుంది.
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్సోసిస్లో పెట్టుబడి పెట్టిన వారంతా, సుదీర్ఘకాలంగా వాటిని ఉపసంహరించడం లేదట. కారణం ఇన్పోసిస్ సంస్ద భవిష్యత్తు వృద్ది చెందడమే. కంపెనీ వ్యవస్థాపకుల మాదిరే కంపెనీని లాభాల బాటలో పరుగెత్తించేందుకు పక్కాగా ప్రణాళికలు రచించారని సమాచారం.
ఇప్పటికే సంస్థలో ఉన్న షేర్లకు సమాన సంఖ్యలో బోనస్ షేర్లను జారీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉచితంగా లభించే ఈ బోనస్ షేర్లు ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టకున్నా, భవిష్యత్తులో మంచి రాబడులను తెస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications