Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేజ్రీపార్టీ నేత ముఖంపై ఇంక్ దాడి, ఇవి తప్పవని వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత యోగేంద్ర యాదవ్ ముఖం పైన ఓ వ్యక్తి సిరా చల్లాడు. శనివారం ఎఎపి నిర్వహించిన సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. సభకు హాజరైన యోగేంద్ర మీడియాతో మాట్లాడుతుండగా, వెనుక నుంచి ఓ గుర్తు తెలియన వ్యక్తి వచ్చి యాదవ్ ముఖంపై ఒక్కసారిగా సిరా పోశాడు.

ఆ తర్వాత వెంటనే భారత్ మాతాకీ జై అంటూ నినదించాడు. ఈ ఘటనతో అక్కడున్న పార్టీ కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పరిస్థితి మరింత అదుపు తప్పకముందే పోలీసులు జోక్యం చేసుకుని, అతన్ని అక్కడి నుంచి తరలించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం జంతర్ మంతర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఎఎపి టోపీ, బ్యాడ్జీ ధరించిన ఆ యువకుడు ముఖంపై సిరా పోశాడు. అతడిని పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు పోలీసులు తరలించారు. షాలిమార్ బాగ్‌కు చెందిన సాగర్‌గా గుర్తించారు.

 Ink attack: Man smears ink on AAP leader Yogendra Yadav's face

కాగా, హర్యానాలోని గుర్గావ్ నుంచి రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎఎపి తరఫున యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. మీతో మాట్లాడుతున్నప్పుడు వెనుక నుంచి వచ్చి ఆ వ్యక్తి నా ముఖంపై సిరా పోశాడని, తాను అతన్ని చూడలేదని, ఈ దేశంలో శక్తివంతులపై పోరాడుతున్నప్పుడు దానికి కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందని, వ్యాఖ్యానించారు. ఏమైనప్పటికీ తనపై దాడి చేసిన ఆ వ్యక్తిని భగవంతుడు క్షమించాలని కోరుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+