నాడు టీ అమ్మిన వ్యక్తి నేడు మనల్ని శాసిస్తారా ?, నాటకం, ప్రధాని మోదీకి అవమానం, దేశద్రోహం కేసు!
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారని, సమాజానికి తప్పుడు సందేశం ఇచ్చారని ఆరోపిస్తూ కర్ణాటకలోని బీదర్ లోని విద్యాసంస్థ మీద కేసు నమోదైయ్యింది. ఆ నాడు టీ అమ్ముకున్న వ్యక్తి నేడు మనల్ని అనేక విలువైన పత్రాలు చూపించాలని ఆదేశాలు జారీ చేసే స్థాయికి ఎదిగారని నాటకంలో ఎగతాలిగా ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారు. విద్యార్థులు ప్రదర్శించిన నాటకంలో ప్రధాని నరేంద్ర మోదీని అవమానించారని ఆరోపిస్తు ఆ విద్యాసంస్థ నిర్వహకుల మీద దేశద్రోహం కేసు నమోదైయ్యింది.

ప్రముఖ విద్యాసంస్థ
కర్ణాటకలోని బీదర్ లో శాహిన్ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. శాహిన్ శిక్షణ సంస్థలో సీఏఏ, ఎన్ఆర్ సీ జారీ చెయ్యడం వలన ప్రజలకు అనేక సమస్యలు ఎదురౌతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఓ నాటకం ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సీఏఏ, ఎన్ఆర్ సీ కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని మేము ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని విద్యాసంస్థ నిర్వహకులు తెలిపారు.

టీ అమ్మిన ప్రధాని మోదీ
విద్యార్థులు ప్రదర్శించిన నాటకంలో ఓ విద్యార్థి ప్రధాని నరేంద్ర మోదీ క్యారెక్టర్ వేశారు. గతంలో టీ అమ్ముకున్న వ్యక్తి నేడు ప్రజల మీద బలవంతంగా సీఏఏ, ఎన్ఆర్ సీ బిల్లులు రుద్దారని, నేడు ఆయన మిమ్మల్ని విలువైన దృవీకరణ పత్రాలు చూపించాలని ఆదేశాలు జారీ చేశారని ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే విధంగా నాటకం ప్రదర్శించారు.

వీడియో వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ గతంలో టీ అమ్ముకున్నారని, నేడు ప్రజల మీద పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపిస్తూ ప్రదర్శించిన నాటకం వేసిన సమయంలో స్థానిక ప్రజలు, టీచర్లు, విద్యార్థుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున్న చప్పట్లు కొట్టారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దేశద్రోహం కేసు
ప్రధాని నరేంద్ర మోదీ గతంలో టీ అమ్ముకున్నారని, నేడు సీఏఏ, ఎన్ఆర్ సీ బిల్లులు ప్రవేశపెట్టారని, ఆయనను కించపరిచే విధంగా నాటకం వేసి దానిని సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ విద్యాసంస్థ మీద కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త నీలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త నీలేష్ ఫిర్యాదు మేరకు విద్యాసంస్థల నిర్వహకుడు డాక్టర్ అబ్దుల్ ఖదీర్ మీద దేశద్రోహం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బీదర్ న్యూ టౌన్ పోలీసు అధికారులు తెలిపారు.

బీజేపీ మంత్రి సీరియస్
ఈ విషయంపై బీదర్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రభు చౌహాన్ సైతం సీరియస్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే విధంగా నాటకం ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చిన విద్యాసంస్థల నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీదర్ జిల్లా ఎస్పీ, బీదర్ న్యూటౌన్ పోలీసు అధికారులకు సూచించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications