భారత్ లో దాడులకు గతంలోనే కెనడా టెర్రరిస్ట్ నిజ్జర్ కుట్రలు ? బయటపెట్టిన నిఘా వర్గాలు...
కెనడాలో అనుమానాస్పద స్ధితిలో హత్యకు గురైన ఖలిస్తాన్ అనుకూల తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ వ్యవహారం ఇప్పుడు ఇరుదేశాల్ని కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది. ఈ హత్యతో భారత్-కెనడా దౌత్య సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దిగజారాయి. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ చేసిన ఆరోపణలు అంతర్జాతీయంగా భారత్ కు ఇబ్బందికరంగా మారాయి. ఆ తర్వాత అమెరికా సహా కెనడా మిత్రదేశాలు భారత్ పై ఒత్తిడి కూడా పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా దీటుగా స్పందిస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ గా గతంలో ఇదే నిజ్జార్ భారత్ లో దాడులకు ఇచ్చిన ఆదేశాలను బయటపెట్టింది. ఈ మేరకు నిఘా వర్గాలు గతంలో నిజ్జార్ భారత్ లో దాడులకు సిక్కులకు ఇచ్చిన ఆదేశాల సమాచారాన్ని వెల్లడించాయి. దీన్ని కెనడాతో భారత్ ఇప్పటికే పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిజ్జార్ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

హర్దీప్ సింగ్ నిజ్జార్ 1980ల నుండి పలు నేరాలలో పాలుపంచుకున్నాడని, చిన్నప్పటి నుండి స్థానిక గూండాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని భారత నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. 1996లో నకిలీ పాస్పోర్ట్తో కెనడాకు పారిపోయి, అక్కడ ట్రక్కు డ్రైవర్గా లో ప్రొఫైల్ను కొనసాగించిన నిజ్జర్.. ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ కోసం పాకిస్థాన్కు వెళ్లినట్లు కూడా తెలిసింది. కెనడా గడ్డపై ఆశ్రయం పొందుతున్న సమయంలో పంజాబ్లో అనేక హత్యలు, దాడులకు అతను ఆదేశించాడని ఆ రిపోర్టులు చెప్తున్నాయి.
2014లో హర్యానాలోని సిర్సాలోని డేరా సచ్చా సౌదా హెడ్క్వార్టర్స్పై ఉగ్రదాడిని అమలు చేయాలని నిజ్జర్ ప్లాన్ చేశాడని నిఘా నివేదికలు చెప్తున్నాయి. అయితే అతను భారత్కు చేరుకోలేకపోయాడని, పంజాబ్కు చెందిన శివసేన నాయకుడు మాజీ డీజీపీ మహ్మద్ ఇజార్ ఆలమ్ను లక్ష్యంగా చేసుకుని తన మాడ్యూల్ను ఆదేశించాడని నిఘా పత్రాలు వెల్లడించాయి. పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి నిజ్జర్ స్ధానిక గ్యాంగ్స్టర్ అర్ష్దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దాలాతో కలిసి మోగాతో కలిసి పనిచేసినట్లు తేలింది.
2020లో 'యాంటీ-పాంథిక్ కార్యకలాపాలు' ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రీకొడుకులు మనోహర్ లాల్ అరోరా, జతీందర్బీర్ సింగ్ అరోరా జంట హత్యలను అర్ష్దీప్కి అప్పగించాడు. ఈ దాడిలో మనోహర్ లాల్ను అతని నివాసంలో కాల్చి చంపారు. నవంబర్ 20, 2020న బటిండా, కానీ అతని కొడుకు తప్పించుకున్నాడు. వారి హత్యకు నిజ్జర్ కెనడా నుంచి డబ్బు పంపినట్లు తేలింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications