నాజిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి .. సక్సెస్ అయితే చిన్నారులకు వ్యాక్సిన్
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం మరో వ్యాక్సిన్ భారత్ బయోటెక్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ ను అత్యవసర పరిస్థితిలో వినియోగించుకోవడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. ఇక తాజాగా చిన్నారులలో వ్యాప్తి చెందే కరోనా మహమ్మారి నివారణ కోసం ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్ ప్రారంభించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ ) యొక్క సబ్జెక్ట్ నిపుణుల కమిటీ భారత్ బయోటెక్ కు అనుమతి ఇచ్చింది.

నాజిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి
ఇప్పటికే పలు దఫాలుగా చర్చల తరువాత, ప్రతిపాదిత మొదటి దశ క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి కమిటీ సిఫార్సు చేసింది. జనవరిలో జరిగిన సమావేశంలో కమిటీ కోరిన ఇంట్రా నాజిల్ క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్తో పాటు హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీదారు తన ప్రతిపాదనను సమర్పించారు.
ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపాదిత మోతాదులో 75 విషయాలతో ఫేజ్ -1 క్లినికల్ ట్రయల్లో భద్రత మరియు ఇమ్యునోజెనిసిటీ డేటాను కూడా నమోదు చెయ్యాలని కమిటీ సంస్థకు సూచించింది.

చిన్నారుల కోసం స్ప్రే రూపంలో , సింగిల్ డోస్ వ్యాక్సిన్
ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కు భారత్ బయోటెక్ మరియు సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ సెప్టెంబరులో లైసెన్సింగ్ ఒప్పందాన్ని ప్రకటించాయి. దీని కింద యుఎస్, జపాన్ మరియు యూరప్ మినహా అన్ని మార్కెట్లలో పంపిణీ హక్కులను సంస్థ పొందింది.
సిరంజీలు , సూదులు వంటి వైద్య వినియోగ వస్తువులు అవసరం లేనందున, ముఖ్యంగా చిన్నారుల కోసం స్ప్రే రూపంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో వస్తున్నందున సింగిల్ డోస్ నాజిల్ వ్యాక్సిన్ టీకాల ఖర్చును తగ్గించడంతో పాటు సమయాన్ని వృధా కాకుండా చేస్తుందని వ్యవస్థాపకుడు మరియు సిఎండి కృష్ణ ఎల్లా పేర్కొన్నారు.

నాజిల్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే చిన్నారులకు వ్యాక్సిన్ లభ్యత
నాజిల్ వ్యాక్సిన్ను ఇక్కడ జీనోమ్ వ్యాలీలోని తన ప్లాంట్ వద్ద తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ముక్కు ద్వారా ఇచ్చే నాజిల్ వ్యాక్సిన్ మొదటి దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్ ఫిబ్రవరి మార్చిలో ప్రారంభించటానికి భారత్ బయోటెక్ కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చిన్నారులపై ఇప్పటివరకూ కోవిడ్-19 వ్యాక్సిన్ల ప్రయోగం చేయలేదని, భారత్ బయోటెక్ యొక్క నాజిల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ కోసం నిపుణుల ప్యానెల్ ఓకే చెప్పటంతో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి . ఇది సక్సెస్ అయితే ఇక చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ జరగుతుంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications