Isro: చంద్రుడు, అంగారక, శుక్రగ్రహాల పైకి వ్యోమనౌకలు పంపే సత్తా భారత్‍కు ఉంది..

చంద్రుడు, అంగారక, శుక్రగ్రహాలపైకి వ్యోమనౌకలు పంపే సత్తా భారత్ కు ఉందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ చెప్పారు. అయితే మరిన్ని పెట్టుబడులు, విశ్వాసం అవసరమన్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి ఆలయాన్ని సోమనాథ్‌ దర్శించారు. "భారతదేశం చంద్రుడు, అంగారక గ్రహం, శుక్రగ్రహాలపైకి ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ మనం మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. మనకు మరింత పెట్టుబడి అవసరం. అంతరిక్ష రంగం అభివృద్ధి చెందాలి.దీని ద్వారా దేశం మొత్తం అభివృద్ధి చెందాలి. అదే మా లక్ష్యం. మేము ప్రధాని మోదీ మాకు అందించిన దార్శనికతను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం" అని సోమనాథ్ చెప్పారు.

చంద్రయాన్-3 100% విజయవంతమైందన్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి ప్రధాని మోదీ శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని అన్నారు. ఆ ప్రాంతానికి పేరు పెట్టే హక్కు దేశానికి ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ శివశక్తి అంటే మనందరికీ సరిపోయే విధంగా వివరించారు. అందులో తప్పేమీ లేదని తన అభిప్రాయమని చెప్పారు. చంద్రయాన్-2 కుప్పకూలిన ప్రదేశానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. రెండూ భారతీయ శబ్దాల పేర్లు.

ISRO Chairman Somanatha says India has capability to send spacecraft to Moon, Mars and Venus

మనం చేసే పని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని అన్నారు. చంద్రయాన్ 3, ల్యాండర్, రోవర్ చాలా యాక్టివ్ గా ఉన్నాయన్నారు. మొత్తం ఐదు పరికరాలు స్విచ్ ఆన్ అయ్యాయని తెలిపారు. ఇవి అందమైన డేటాను ఇస్తున్నాయి. ఇంకా పది రోజులు మిగిలి ఉన్నాయి. మేము వివిధ పద్ధతుల పూర్తి సామర్థ్యంతో అన్ని ప్రయోగాలను పూర్తి చేయగలమని మేము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశం తీయలేని చంద్రుడి ఫొటోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ ఫొటోలు కంప్యూటర్ కేంద్రానికి వెళ్తున్నాయని చెప్పారు.

అక్కడ శాస్త్రవేత్తలు వాటిని ప్రాసెస్‌ చేస్తున్నారని.. త్వరలోనే ఆ ఫొటోలను విడుదల చేస్తామని సోమనాథ్ ప్రటించారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగించేందుకు పూర్తిగా సిద్ధమైందని ఇస్రో చీఫ్ తెలిపారు. "ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం సిద్ధంగా ఉంది. అది శ్రీహరికోటకు చేరుకుంది. పిఎస్‌ఎల్‌వికి అనుసంధానించబడింది. ప్రయోగం సెప్టెంబర్ మొదటి వారంలో ఉంటుంది. తేదీని రెండు రోజుల్లో ప్రకటిస్తాం" అని వివరించాడు. "ప్రయోగం తర్వాత, అది దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి వెళుతుంది. దాని నుంచి దాదాపు 120 రోజులు పట్టే L1 పాయింట్‌కి ప్రయాణిస్తుంది" అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+