Chandrayaan3: అడుగు దూరంలో జాబిల్లి.. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న యావత్ భారతావని..
చంద్రుడి వైపు చంద్రయాన్ 3 దూసుకెళ్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఒక్కో పని చేసుకుంటు ముందుకు వెళ్తున్నారు. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ ను వేరు చేశారు. శుక్రవారం నుంచి శాస్ర్తవేత్తలు విక్రమ్ ల్యాండర్ డీబూస్ట్ చేస్తున్నారు. 30 కి.మీ. పెరిలూన్ (చంద్రునికి కక్ష్య అత్యంత సమీప బిందువు), 100 కి.మీ. అపోలూన్ (చంద్రుని నుండి అత్యంత దూరపు స్థానం) ఉన్న కక్ష్యలో దాని స్థానం కోసం "డీబూస్ట్" (నెమ్మదించే ప్రక్రియ) చేయడం మొదలుపెట్టారు.
కాగా ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రస్తుత కక్ష్యలో నెలలు లేదా సంవత్సరాల పాటు దాని ప్రయాణాన్ని కొనసాగించనుంది. చంద్రయాన్ 3ప్రయోగాన్ని జూలై 14న చేపట్టారు. అప్పటి నుంచి క్రమక్రమంగా చంద్రయాన్ చంద్రుడి వద్దకు తీసుకెళ్లారు. మొదట భూ కక్ష్యలో తిరిగిన చంద్రయాన్ ను ఆగస్ట్ 1న ఆర్బిటాల్ ప్రవేశపెట్టారు. ఆగస్టు 5 న చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత క్రమంగా దూరాన్ని తగ్గిస్తూ చంద్రుడికి దగ్గరగా తీసుకొచ్చారు. బుదవారం రోజు చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చారు.

గురువారం రోజు ల్యాండర్ మాడ్యూల్ ను వేరు చేశారు. ఇప్పుడు ల్యాండర్ వేగాన్ని క్రమంగా తగ్గిస్తున్నారు. ఈ ల్యాండర్ ఆగస్టు 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడిపే పరిశోధనలు చేస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే చంద్రుడి పైకి ల్యాండర్, రోవర్ పంపిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే సోవియట్ యూనియన్, అమెరికా, చైనా చంద్రుడి పైకి రోవర్లను పంపాయి.
ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే రెండు సార్లు చంద్రుడిపైకి రోవర్లను పంపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు మాత్రం ఈ ప్రయోగం విజయవంతం కావాలని యావత్ భారత దేశం కోరుకుటుంది. భారత తర్వాత రష్యా ప్రయోగించిన లూనా-25 కు చంద్రుడిపై దిగేందుకు సిద్ధమైంది. లూనా-25 ఆగస్టు 21 నుంచి 23 మధ్య చంద్రుడిపై ల్యాండ్ కానుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications