వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో 60వేల మందికి నోటీసులు? నల్లధనం ఉందనే?

మరో 60 వేల మందికి ఆదాయపు పన్ను శాఖ త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది. వీరంతా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.ఈ మేరకు ఆదాయపు పన్నుశాఖ త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేయనుందని అ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మరో 60 వేల మందికి ఆదాయపు పన్ను శాఖ త్వరలోనే నోటీసులు జారీ చేయనుంది. వీరంతా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.ఈ మేరకు ఆదాయపు పన్నుశాఖ త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేయనుందని అధికారులు తెలిపారు.

నల్లధనం నిర్మూలన కార్యక్రమం రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఆదాయపు పన్నుశాఖ ఈ నిర్ణయం తీసుకొంది. దేశవ్యాప్తంగా 60 వేల మందికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టుగా సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ టాక్సెస్ నిర్ణయం తీసుకొంది.

IT department to issue notices to 60,000 persons with black money

డీమానిటీజైషన్ తర్వాత నల్లధనం నిర్మూలన ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకొంది ఆదాయపు పన్ను శాఖ.అయితే ఆదాయపు పన్ను శాఖ అనేక ఖాతాలను పరిశీలిచిన మీదట ఈ 60 వేల మంది ఇంకా నల్లధనాన్ని కలిగి ఉన్నారని ఆదాయపు పన్నుశాఖ అనుమానిస్తోంది.దీంతో ఈ మేరకు వీరందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకొంది.

తొలి రౌండ్ లో ఆదాయపు పన్నుశాఖాధికారులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున నల్లదనాన్ని స్వాధీనం చేసుకొన్నారు. అయితే ప్రస్తుతం రెండవ విడత నల్లధనాన్ని వెలికి తీసే కార్యక్రమం సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ మేరకు 60వేల మందికి నోటీసులు జారీ చేయనున్నారు.

English summary
At least 60,000 people will be issued notices by the Income Taxdepartment in what is known as a second round of clean up after thedecision on demonetisation was made.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X