సీఎం షాక్ ఇచ్చిన ఐటీ శాఖ అధికారులు, అకౌంటెంట్ ఇంటిలో సోదాలు, సినీ తారలు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు పరోక్షంగా ఝలక్ ఇచ్చారు. సీఎం కుమారస్వామి చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఇల్లు, కార్యాలయాలపై గురువారం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేసి సోదాలు చేశారని తెలిసింది.
బెంగళూరులోని కుమారపార్క్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ హెచ్.బి. సునీల్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు, జేడీఎస్ నాయకులు అంటున్నారు.
చార్టెడ్ అకౌంటెంట్ సునీల్ సీఎం కుమారస్వామితో పాటు ఆయన భార్య, కుమారుడు ఆస్తుల లెక్కలు చూసుకుంటున్నారు. అంతే కాకుండా అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారల అకౌంట్స్ ను సునీల్ చూసుకుంటున్నారు.

గత శాసన సభ ఎన్నికల సందర్బంలో సునీల్ ఇంటిలో ఐటీ సోదాలు జరిగాయి. సునీల్ ఇంటిలో ఐటీ దాడులు చెయ్యడాన్ని జేడీఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
తన ఇంటిలో, కార్యాలయంలో ఐటీ శాఖ దాడులు జరగలేదని చార్టెడ్ అకౌంటెంట్ సునీల్ అంటున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులతో పాటు జేడీఎస్ నాయకులు ఐటీ శాఖ దాడులు జరిగాయని అంటున్నారు. మొత్తం మీద సీఎం కుమారస్వామికి ఐటీ శాఖ పరోక్షంగా ఝలక్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications