జయ సన్నిహితుడి డైరీ సీజ్: మంత్రులు పరుగో పరుగు !
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు దగ్గర ఉన్న డైరీ, ల్యాప్ టాప్ తదితర పత్రాలను ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అసలు గుట్టు ఉందని ఐటీ అధికారులు అంటున్నారు.
అంతే కాకుండా ఇప్పటికే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి దగ్గర డైరీ స్వాధీనం చేసుకున్నారు. రామ్మోహన్ రావు, శేఖర్ రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న డైరీలలో నలుగురు సీనియర్ మంత్రులు, అధికార పార్టీ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎప్పుడెప్పుడు కలిసింది, ఏం చేసింది అనే పూర్తి వివరాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు.
రామ్మోహన్ రావుతో కలిసి పని చేస్తున్న అధికారుల పేర్లు, వివరాలు డైరీలో ఉండటం సహజమే. అయితే అధికార పార్టీ నాయకులతో ఎప్పుడెప్పుడు మాట్లాడింది, ఆ సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరెవరు అక్కడ ఉన్నారు ? అనే వివరాలు ఉన్నాయని తెలిసింది.

ఈ వివరాలు సేకరించిన ఐటీ అధికారులు రామ్మోహన్ రావు, అధికార పార్టీ నాయకులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల మొబైల్ ఫోన్ సంభాషణల వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో శేఖర్ రెడ్డి దగ్గర స్వాధీనం చేసుకున్న డైరీలో నలుగురు మంత్రుల బండారం బయటపడిందని తెలిసింది.
నలుగురు మంత్రులు, ఒక ఏడీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి, 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు శేఖర్ రెడ్డి అవినీతి భాగోతంలో భాగస్వామ్యం ఉందని స్పష్టం అయ్యిందని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు.
నలుగురు మంత్రులు, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలిసి నల్లకుబేరులతో కలిసి స్టార్ హోటళ్లలో విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారని అధికారులు గుర్తించారు. ఇప్పుడు రామ్మోహన్ రావు, శేఖర్ రెడ్డి దగ్గర ఉన్న డైరీలను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో వారు హడలిపోతున్నారు.
రామ్మోహన్ రావుతో పాటు శేఖర్ రెడ్డితో నిత్యం టచ్ లో ఉంటూ బ్లాక్ మనీ దందాకు సహకరించారని వెలుగు చూసింది. వీరిద్దరితో సన్నిహిత సంబంధాలు ఉన్న అన్నాడీఎంకే నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు హడలిపోతున్నారు. ఎప్పుడు ఐటీ అధికారులు దాడి చేస్తారో అని హడలిపోతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications