బెంగళూరులో ఐటీ సోదాలు: రూ.5 కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్ది బంగారం సీజ్
ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.4 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.5 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు బెంగళూరులో నివాసం ఉంటున్న ఇద్దరు అధికారుల ఇళ్లలో నిర్వహించారు.
ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఆ ఇద్దరు అధికారుల వద్ద మరింత కొత్త కరెన్సీ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ దిశలోను విచారణ జరుపుతున్నారు.

తాము సోదాలు నిర్వహించామని, పెద్ద మొత్తంలో డబ్బులు సీజ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీతో పాటు ఐదు కిలోల బంగారు ఆభరణాలు, ఓ ఖరీదైన కారును గుర్తించారు.
కాగా, ఐటీ అధికారులు గత రెండు రోజులుగా బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు అధికారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం నాడు కూడా సోదాలు నిర్వహించారు. నిన్న ముఖ్యమంత్రికి దగ్గరివాడైన ఓ అధికారి ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications