Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో ఐటీ సోదాలు: రూ.5 కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్ది బంగారం సీజ్

ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.4 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరు: ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం నాడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.5 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు బెంగళూరులో నివాసం ఉంటున్న ఇద్దరు అధికారుల ఇళ్లలో నిర్వహించారు.

ఇద్దరు సీనియర్ అధికారుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. ఆ ఇద్దరు అధికారుల వద్ద మరింత కొత్త కరెన్సీ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆ దిశలోను విచారణ జరుపుతున్నారు.

it

తాము సోదాలు నిర్వహించామని, పెద్ద మొత్తంలో డబ్బులు సీజ్ చేశామని ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీతో పాటు ఐదు కిలోల బంగారు ఆభరణాలు, ఓ ఖరీదైన కారును గుర్తించారు.

కాగా, ఐటీ అధికారులు గత రెండు రోజులుగా బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. పలువురు అధికారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం నాడు కూడా సోదాలు నిర్వహించారు. నిన్న ముఖ్యమంత్రికి దగ్గరివాడైన ఓ అధికారి ఇంటి పైన కూడా సోదాలు నిర్వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+