ఉగ్ర కాల్పులు: నలుగురు పోలీసులు మృతి
షోపియాన్: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో బుధవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పోలీస్ వాహనాన్ని బాగుచేసుకునేందుకు వెళ్లిన పోలీసులపై విచక్షణారహితంగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
కాగా, చనిపోయిన పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. షోపియాన్లోని అర్హామా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

పోలీసులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది కాశ్మీర్ లోయలో పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 30 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ఇది ఇలా ఉండగా, అనంత్నాగ్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పోలీసులపై దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది.
ఈ ఎన్కౌంటర్లో హిజ్బుల్ టాప్ కమాండర్ అల్తఫ్ అహ్మద్ దార్ హతమయ్యాడు. ఈ దాడికి ప్రతీకారంగానే పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఉంటారని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications