ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి: తమ పనేనంటూ లష్కరే తొయిబా
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. అచాబల్ పట్టణంలో భద్రతా సిబ్బంది క్యాంపుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయాలపాలయ్యారు.
కాల్పుల్లో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడు. ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరపగా, జవాన్లు ఎదురుకాల్పులు జరిపారని అధికారులు వెల్లడించారు.చనిపోయిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ మీనా, కానిస్టేబుల్ సందీప్లుగా గుర్తించారు.

కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతను పెంచిన పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేర్కొంది.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications