పాక్ తీరు మారదు: మరోసారి కాల్పులు, ముగ్గురు పౌరులు మృతి
కుప్వారా: ప్రపంచమంతా కరోనావైరస్తో పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తమకేమీ పట్టనట్లు భారతదేశంపై తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం జమ్మూకాశ్మీర్లోని కుప్వారాలో పాకిస్థాన్ సైనికులు కాల్పులతో తెగబడ్డారు. దీంతో ముగ్గురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
ఆదివారం సాయంత్రం 5 గంటలకు పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. పూంఛ్, కథువా జిల్లాల తర్వాత కుప్వారాలోని రంగ్వార్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు.

కిర్ని, కస్బా జిల్లాలో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ గాయపడిందని ఆర్మీ అధికారులు తెలిపారు. బాలాకోట్ సెక్టార్లో దాచివుంచిన ఓ లైవ్ మోర్టారు బాంబును గుర్తించిన భద్రతా దళాలు, దాన్ని నిర్వీర్యం చేశాయి.
కాగా, గత శనివారం బాలకోట్, మెందర్ సెక్టార్లలో పాకిస్థాన్ పెద్ద ఎత్తున కాల్పులకు తెగడటంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయని ఆర్మీ అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా వరుసగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు.
గత ఆదివారం ఉగ్రవాదులకు, జవాన్లకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు మరణించారు. భారత జవాన్ల కాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications