రూ. 150 కోట్ల లంచం కేసు, సిట్ కు పత్రాలు, పెన్ డ్రైవ్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డి, ఏముంది ?
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామికి వ్యతిరేకంగా తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) అధికారులకు అవసరమైన పత్రాలు మొత్తం ఇచ్చానని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బాంబు పేల్చారు.
మంగళవారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (ఎస్ఐటీ) కార్యాలయం నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనేక సాక్షాలతో పాటు అధికారులకు తాను ఓ పెన్ డ్రైవ్ ఇచ్చానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

జంతకల్ మైనింగ్ కంపెనీకి సంబంధించి ఎస్ఐటీ అధికారులకు తాను బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు ఇచ్చానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇంతకు ముందు ఈ కేసుకు సంబంధించి విచారణ సవ్యంగా జరగలేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
కీలక సాక్షాలు నాశనం అవుతాయనే భయంతోనే తాను గతంలో వాటిని అధికారులకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు తన దగ్గర ఉన్న సాక్షాలు మొత్తం ఇచ్చానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. జంతకల్ మైనింగ్ కంపెనీ నుంచి మాజీ సీఎం కుమారస్వామి తదితరులు రూ. 150 కోట్లు లంచం తీసుకుంటున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాల సీడీ తన దగ్గర ఉందని గాలి జనార్దన్ రెడ్డి గతంలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications