బీ ఫామ్ లో జయలలిత వేలిముద్ర: ఓకే చెప్పిన డాక్టర్ కు రూ. లక్షలు లంచం !

అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల సందర్బంగా సమర్పించిన బీ ఫామ్ లో జయలలిత వేలి ముద్ర వేశారని, వేలి ముద్ర జయలలితదే అని దృవీకరించిన డాక్టర్ బాలాజీకి ఆరోగ్య శాఖా మంత్రి

నై: గత ఏడాది తంజావూరు, అరవకురిచ్చి, తిరప్పరగుండ్ర ఉప ఎన్నికలు జరిగిన సమయంలో జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బీ ఫామ్ మీద జయలలిత వేలిముద్రలు వేసి ఉండటం వెలుగులోకి వచ్చింది.

Jaya puts thumb impression instead of signature on party candidetes’ nominations

జయలలిత వేలిముద్రపై అప్పట్లో పెద్దవివాదం బయలుదేరింది. ప్రభుత్వ వైద్యుడి సమక్షంలోనే జయలలిత వేలిముద్ర వేశారని అన్నాడీఎంకే నాయకులు అప్పట్లో వివరణ ఇచ్చారు. మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రోఫెసర్ డాక్టర్. పి. బాలాజీ సైతం బీ ఫామ్ లో ఉన్న వేలి ముద్ర జయలలితదే అని దృవీకరించారు.

తరువాత ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో తంజావూరు, అరవకురిచ్చి, తిరప్పరగుండ్ర ఉప ఎన్నికలు పూర్తి అయ్యాయి. అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా, బీ ఫామ్ లో ఉన్న వేలి ముద్ర జయలలితదే అని దృవీకరించిన ప్రభుత్వ వైద్యుడు బాలాజీకి రూ. 5 లక్షలు లంచం ఇచ్చారని తాజాగా వెలుగు చూసింది.

తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ స్వయంగా మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రోఫెసర్ డాక్టర్. పి. బాలాజీకి రూ. 5 లక్షలు లంచం ఇచ్చారని ఓ ఆధారం ఆదాయపన్ను శాఖ అధికార వర్గాలకు లభించడం గమనార్హం.

ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంటిలో సోదాలు చేసే సమయంలో ఆ ఆధారం ఐటీ శాఖ అధికారుల చేతికి చిక్కిందని వెలుగు చూసింది. ఇప్పుడు మద్రాస్ మెడికల్ కాలేజ్ ప్రోఫెసర్ డాక్టర్. పి. బాలాజీని ఐటీ శాఖ అధికారులు పిలిపించి విచారణ చేసే అవకాశం ఉందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+