జయలలిత మృతి మిస్టరీ-తమిళనాడు సీఎంకు ఆర్ముగస్వామి కమిషన్ నివేదిక-ఏముందంటే ?
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్ కు తమ నివేదిక సమర్పించింది. మాజీ సీఎం జయలలిత ఏ పరిస్ధితుల్లో ఆస్పత్రిలో చేరారు, అనంతరం ఆమెకు జరిగిన చికిత్స, మరణం వరకూ చోటు చేసుకున్న పరిణామాలపై విచారణ జరిపిన కమిషన్.. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
2017లో జయలలిత మరణంపై విచారణ కోసం అప్పటి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కార్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి ఆధ్వర్యంలో కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ విచారణ నివేదిక సమర్పించేందుకు గడువును ఏకంగా 14 సార్లు పొడిగించారు. చివరికి ఈ నెల 4న కూడా మరో పొడిగింపు కూడా ఇచ్చారు. ఎట్టకేలకు కమిషన్ ఇవాళ తన నివేదికను సీఎం స్టాలిన్ కు సమర్పించింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జస్టిస్ ఆరుముఖస్వామి 150 మందికి పైగా సాక్షులను విచారించి 600 పేజీల నివేదికను సమర్పించారు. ఈ నివేదికను ఇంగ్లీష్, తమిళంలో అందజేశారు.

ఈ నివేదికలో జయలలితకు అందించిన చికిత్సలో అపోలో హాస్పిటల్స్కు క్లీన్ చిట్ ఇస్తూ ఆర్ముఘస్వామి కమీషన్కు వైద్య నివేదికలతో సహాయం చేయడానికి ఏర్పాటైన ఎయిమ్స్ మెడికల్ ప్యానెల్ గతంలో తన నివేదికను సమర్పించింది దాని తుది నిర్ధారణతో ఏకీభవించింది. ఈ నేపథ్యంలో ఆర్ముగస్వామి కమిషన్ కూడా ఇదే అంశాలతో నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. నివేదికలో పూర్తి అంశాలు బహిర్గతం కాకపోయినా జయలలితకు అందిన చికిత్స విషయంలో ఎలాంటి పొరబాట్లు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాత్రం తెలుస్తోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications