కిక్కిరిసిన రాజాజీ హాల్: చెన్నైకి రానున్న రాష్ట్రపతి, ప్రధాని
సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవదేహాన్ని ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్కు తరలించారు. ఆ తర్వాత ప్రఖ్యాత రాజాజీ హాల్కు తరలించారు.
న్యూఢిల్లీ/చెన్నై: సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవదేహాన్ని ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్కు తరలించారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం దివంగత నేత పార్థివ దేహాన్ని ప్రఖ్యాత రాజాజీ హాల్కు తరలించారు.
ప్రజల సందర్శనార్థం మంగళవారం సాయంత్రం వరకు అక్కడే ఉంచుతారు. 'అమ్మ'ను కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున రాజాజీ హాల్కు చేరుకుంటున్నారు. వేలాదిగా ప్రజలు తరలివస్తుండటంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు జయ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మెరీనా బీచ్లో ఎంజీఆర్ సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు చేయనున్నారు.

నేడు చెన్నైకి రాష్ట్రపతి, ప్రధాని: భారీ బందోబస్తు
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం చెన్నై నగరానికి రానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు చెన్నై చేరుకోనున్నారు. నేరుగా రాజాజీహాల్కు చేరుకుని 'అమ్మ' పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు. వారి రాక సందర్భంగా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జయలలిత మృతి నేపథ్యంలో తమిళనాడులో 3రోజులపాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 7రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. కాగా, ఆగస్టు 15న చివరిసారి జయలలిత ప్రజలకు కనిపించారు. ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో 74రోజుల చికిత్స పొంది సోమవారం రాత్రి కన్నుమూశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications