జయలలిత మృతి, హై కోర్టులో పిల్: వివరాలు ఇవ్వండి !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలు వెల్లడించాలని మనవి చేస్తూ సామాజిక సేవకుడు (ఆర్ టీఐ కార్యకర్త) ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హై కోర్టులు ప్రజాహితవాజ్యం దాఖలు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అపోలో ఆసుపత్రిలో అందించిన చికిత్స వివరాలు వెల్లడించాలని మనవి చేస్తూ సామాజిక సేవకుడు (ఆర్ టీఐ కార్యకర్త) ట్రాఫిక్ రామస్వామి మద్రాసు హై కోర్టులు ప్రజాహితవాజ్యం దాఖలు చేశారు.
సెప్టెంబర్ 22వ తేదిన జయలలిత ఆపోలో ఆసుపత్రిలో చేరారని, తరువాత అపోలో ఆసుపత్రి వైద్యులు, లండన్, సింగపూర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు జయలలితకు చికిత్స అందించారని కోర్టుకు వివరించారు.

అంతర్జాతీయ నిపుణులు జయలలితకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం అమ్మ కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి ప్రకటనలు జారీ చేసిన కొన్ని రోజులకే జయలలిత మరణించారని, జయ మృతిపై ప్రజల్లో అనుమానం కలుగుతోందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
జయలలితకు అపోలో ఆసుపత్రిలో 75 రోజుల పాటు ఏయే చికిత్సలు చేశారు అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ట్రాఫిక్ రామస్వామి తన పిటీషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ విచారణకు స్వీకరించాలా ? వద్దా ? అనే విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మద్రాసు హైకోర్టు రిజిస్టార్ జనరల్ కార్యాలయం తెలిపింది. 2017 జనవరి 9వ తేదీన ఏ విషయం చెబుతామని స్పష్టం చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications