జయలలిత సెక్రటరీ విచారణ, ఆరోజు పోయెస్ గార్డెన్ లో ఏం జరిగిందంటే: క్లారిటీ !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ ముమ్మరం చేశారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్ తీరికలేకుండా పలువురికి సమన్లు జారీచేసి విచారణ చేస్తోంది. తాజాగా మూడో సారి జయలలిత పర్సనల్ సెక్రటరీ పొన్ గుండ్రన్ ని మంగళవారం విచారణ చేసి పోయెస్ గార్డెన్ లో ఆ రోజు ఏం జరిగింది అనే వివరాలు సేకరించారు.

పోయెస్ గార్డెన్
జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఆమె పర్సనల్ సెక్రటరీగా పొన్ గుండ్రన్ పని చేశారు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం వ్యవహారాలు మొత్తం పొన్ గుండ్రన్ కు తెలుసు. అక్కడి వ్యవహారాలు పొన్ గుండ్రన్ కు తెలియకుండా జరగవని సమాచారం.

అమ్మకు క్లోజ్
జయలలితకు పర్సనల్ సెక్రటరీగానే కాకుండా అమ్మకు పొన్ గుండ్రన్ చాల సన్నిహితుడని సమాచారం. జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేస్తున్న రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ పొన్ గుండ్రన్ కు మరోసారి సమన్లు జారీ చేసింది.

పొన్ గుండ్రన్ క్లారిటీ
మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు మంగళవారం హాజరైన పొన్ గుండ్రన్ వివరణ ఇచ్చారు. 2016 సెప్టెంబర్ 22వ తేదీన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఏం జరిగింది ? అనే పూర్తి సమాచారం పొన్ గుండ్రన్ వివరించారని తెలిసింది.

ఎవరెవరు ఉన్నారు ?
2016 సెప్టెంబర్ 22వ తేదీన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో అమ్మ జయలలితతో పాటు ఎవరెవరు ఉన్నారు? శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎవరెవరు అక్కడికి వచ్చారు అనే పూర్తి సమాచారం ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సేకరించిందని తెలిసింది.

షీలా బాలక్రిష్ణన్
జయలలితకు చాల సన్నిహితంగా ఉన్న తమిళనాడు ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ షీలా బాలక్రిష్ణన్ కు జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ మరోసారి సమన్లు జారీ చేసింది. గురువారం (జనవరి 11)వ తేదీ విచారణకు హాజరు కావాలని షీలా బాలక్రిష్ణన్ కు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సూచించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications