కర్ణాటకలో ముందే చేతులెత్తేసిన జేడీఎస్ కుమారస్వామి; 10మంది స్వతంత్రులతో కాంగ్రెస్ సంప్రదింపులు!!
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ కొనసాగుతుండగా, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం పావులు కదులుతున్నాయి. ఈసారి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించడంతో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి.
ప్రత్యర్థి పార్టీలలో విజయం సాధించే ఎమ్మెల్యేల పైన, విజయావకాశాలు ఉన్న స్వతంత్ర అభ్యర్థుల పైన ప్రధానంగా అన్ని పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పది మంది స్వతంత్ర అభ్యర్థులతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఈసారి ఎక్కువ మంది స్వతంత్రులు తిరుగుబాటు అభ్యర్థులు గెలుస్తారు అంచనాలకు అనుగుణంగా అధికార విపక్ష పార్టీ నేతలు వారిని తమ వైపు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. తమ పార్టీ నుండి గెలిచి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో పది మంది స్వతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడానికి వారితో సంప్రదింపులు జరిగినట్టు సమాచారం.ఇదిలా ఉంటే నిన్నటిదాకా తాము కింగ్ ల మనీ, కింగ్ మేకర్ కాదని చెప్పిన జెడిఎస్ పార్టీ అధినేత హెచ్డి కుమారస్వామి ప్రస్తుతం మాట మార్చారు.
తమ పార్టీ చిన్న పార్టీ అని, తమను ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుతం తమ అవసరం ఉండకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అంత డిమాండ్ కూడా లేదని చెప్పారు జేడీఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి. కాంగ్రెస్, బీజేపీ నాయకులెవరూ తమను సంప్రదించింది లేదన్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ కూడా క్యాంప్ రాజకీయాలకు తెర తీసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గెలుపు అవకాశం ఉన్న ఎమ్మెల్యేలనే తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. స్వతంత్ర అభ్యర్థులను సైతం వదలకుండా బిజెపి క్యాంప్ రాజకీయాలు చేస్తోంది. మొత్తంగా చూస్తే కొనసాగుతున్న స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఏ పార్టీకి నమ్మకం లేకపోవడంతో, ఎవరి ప్రయత్నాల్లో వారు క్యాంప్ రాజకీయాలకు తెర తీసినట్లు సమాచారం.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications