ABP-C Voter Opinion Poll:మరోసారి నితీశ్ పాగా.. కూటమికి మెజార్టీ సీట్లు..ఏబీపీ సర్వే
బీహర్లో తిరిగి జేడీయూ-బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని ఏబీపీ సీ ఓటర్ ఓపినీయన్ పోల్ అంచనా వేసింది. నితీశ్ కుమార్ నాలుగోసారి సీఎం పదవీ చేపట్టబోతున్నారని లెక్కగట్టింది. బీహర్ ఓటర్లు మరోసారి నితీశ్ కుమార్కు పట్టం కట్టబోతున్నారని తెలిపింది. జేడీయూ కూటమికి పూర్తి స్థాయి మెజార్టీ వస్తోందని తెలిపింది.
Recommended Video
బీహర్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 122 మెజార్టీ మార్క్ దాటాలి.. అయితే ఏబీపీ సర్వే ప్రకారం నితీశ్ కూటమికి 135 నుంచి 159 సీట్లు వస్తాయని లెక్కగడుతోంది. విపక్ష ఆర్జేడీ మరోసారి ప్రతిపక్ష పాత్ర పోషించబోతోందని చెప్పింది. ఈ కూటమికి 77 నుంచి 98 సీట్ల వరకు వస్తాయని తెలిపింది. ఇక ఎల్జేపీ ప్రభావం చూపదని.. 1 నుంచి 5 సీట్లు మాత్రమే గెలచుబోతుందని అంచనా వేసింది. ఇతరులు కూడా 4 నుంచి 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటారని.. జేడీయూకు పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో ఇండిపెండెంట్ల ప్రభావం ఉండబోదని తెలిపింది.

కరోనా వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్తో బీహరీలు సొంత రాష్ట్రానికి వచ్చారు. ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. ముజఫర్ నగర్ షెల్టర్ హోం కేసు.. తదితర అంశాలు నితీశ్ ప్రభుత్వాన్ని ఇరుకన పెడతాయని ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటిని పటాపంచలు చేస్తూ.. ఏబీపీ సర్వే చెప్పింది. అయితే ఇదీ నిజమవుతుందే తలకిందులు అవుతుందో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
బీహర్లో మూడు విడతల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తొలి విడత ఎన్నిక 28వ తేదీన జరగబోతుంది. మరో రెండు విడతల పోలింగ్ తర్వాత.. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు. వయోజనులను ఆకట్టుకొనేందుకు పార్టీలు మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉద్యోగాల పేరుతో ఆశలు కల్పిస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications