బాంబు బెదిరింపు: మస్కట్లో దిగిన జెట్ఎయిర్వేస్
ముంబై/మస్కట్: బాంబు బెదిరింపుతో జెట్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఒమన్ రాజధాని మస్కట్లో అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి దుబాయి వెళ్తున్న 9డబ్ల్యు 536నెంబరు విమానం బాంబు బెదిరింపు కారణంగా దారి మళ్లించి మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించారు.
54 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా విమానం నుంచి కిందకు దిగారు. స్థానిక భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తనిఖీలు పూర్తయిన తర్వాత తిరిగి జెట్ ఎయిర్వేస్ ఇక్కడ్నుంచి బయల్దేరుతుందని ఓమన్ జనరల్ మేనేజర్ రియాజ్ కుట్టరీ తెలిపారు. బాంబు బెదిరింపు కారణంగా ఎయిర్ పోర్టును పది నిమిషాల పాటు మూసివేశారు.
ఇటీవల ఓ టర్కీష్ విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానం దిగింది. తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చెప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం అక్కడ్నుంచి బయల్దేరి వెళ్లింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications