వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు బెదిరింపు: మస్కట్‌లో దిగిన జెట్‌ఎయిర్‌వేస్‌

|
Google Oneindia TeluguNews

ముంబై/మస్కట్: బాంబు బెదిరింపుతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఒమన్‌ రాజధాని మస్కట్‌లో అత్యవసరంగా దిగింది. ముంబై నుంచి దుబాయి వెళ్తున్న 9డబ్ల్యు 536నెంబరు విమానం బాంబు బెదిరింపు కారణంగా దారి మళ్లించి మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించారు.

54 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా విమానం నుంచి కిందకు దిగారు. స్థానిక భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Jet Airways flight makes emergency landing in Muscat after midair bomb scare

తనిఖీలు పూర్తయిన తర్వాత తిరిగి జెట్ ఎయిర్‌వేస్ ఇక్కడ్నుంచి బయల్దేరుతుందని ఓమన్ జనరల్ మేనేజర్ రియాజ్ కుట్టరీ తెలిపారు. బాంబు బెదిరింపు కారణంగా ఎయిర్ పోర్టును పది నిమిషాల పాటు మూసివేశారు.

ఇటీవల ఓ టర్కీష్ విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా న్యూఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానం దిగింది. తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని చెప్పడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం అక్కడ్నుంచి బయల్దేరి వెళ్లింది.

English summary
A Jet Airways plane from Mumbai to Dubai has made emergency landing in Muscat after a midair bomb threat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X