బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి సోదరి ఇల్లు లూటీ చేసిన దుండగులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మంత్రి సోదరి ఇంటిలో చోరబడిన దుండగులు భీభత్సం చేసి ఇల్లు లూటీ చేసిన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పోలీసు అధికారులు సంఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలో జనవనరుల శాఖా మంత్రిగా ఎం.బీ. పాటిల్ ఉన్నారు.

ఈయన సోదరి కల్పనా పాటిల్ విజయనగరలోని శాంతినికేతన్ లేఔట్ లో నివాసం ఉంటున్నారు. గురువారం వేకువ జామున కల్పనా పాటిల్ తో పాటు నలుగురు గాఢనిద్రలో ఉన్నారు. అదే సమయంలో 15 మంది దుండగులు వీరి ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు.

 Jewellery, cash taken away from the house of minister sister in Bengaluru

తరువాత కల్పనా పాటిల్ తోపాటు అందరిని తాళ్లతో కట్టివేశారు. ఇల్లు మొత్తం గాలించి బంగారు, వజ్రాల నగలతో పాటు నగదు లూటీ చేసి అక్కడి నుంచి పరారైనారు. తరువాత అతి కష్టం మీద చేతికట్లు విప్పుకున్న కల్పనా పాటిల్ కుటుంబ సభ్యులు సోదరుడు ఎం.బీ. పాటిల్ కు సమాచారం ఇచ్చారు.

తరువాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 300 గ్రాముల బంగారు నగలు, రూ. 8 లక్షల విలువైన వజ్రం, 15 లక్షల రూపాయల నగదుల లూటీ అయ్యిందని కల్పనా పాటిల్ ఫిర్యాదు చేశారని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
The police, quoting the family members as saying, said that a 15-member gang first knocked on the door of the house at around 2 a.m.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X