వచ్చే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు: ముఖేశ్ అంబానీ
5జీ సేవలను ప్రధాని మోడీ లాంచ్ చేశారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అదే వేదిక నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశంలో గడప గడపకు 5జీ సేవలను అందిస్తామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన నెట్ వర్క్ అందిస్తామని వివరించారు.

2023 డిసెంబర్ నాటికి..
2023 డిసెంబర్ నాటికి దేశంలో అన్నీ ప్రాంతాలకు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కోల్ కతా, ఢిల్లీ, ముంబై, చెన్నైలో మాత్రం ఈ దీపావళి నుంచి 5జీ సర్వీస్ అందుబాటులోకి వస్తోందని తెలిపారు. 5జీ అనేది టెక్నాలజీ పరంగా నెక్ట్స్ జనరేషన్ అని ఆయన చెప్పారు. 21 శతాబ్దంలో మరింత మెరుగైన సేవలు అందించబోతున్నామని తెలిపారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, రోబోటిక్స్, బ్లాక్ చెయిన్ అండ్ మెటా వర్స్ పరంగా ధీటుగా సేవలు అందించబోతుందని పేర్కొంది.

మరింత వేగంగా సేవలు
5జీ నెట్ వర్క్తో విద్యాపరంగా మరింత మెరుగైన సేవలు అందించే వీలు ఉంటుంది. నైపుణ్య అభివృద్ది శిక్షణ కూడా మెరుగుపడుతుంది. 5జీ సర్వీస్తో అంతర్జాతీయంగా ఇండియా మరింత గట్టి పోటీని ఇవ్వబోతుందని పేర్కొంది. 5జీ వల్ల ఆస్పత్రులకు కూడా మంచి నాణ్యమైన నెట్ అందుబాటులోకి వస్తోందని తెలిపారు. క్షణాల్లోనే బెస్ట్ డాక్టర్స్ సర్వీస్ తీసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 5జీ తో హెల్త్, ఇన్ కం, హ్యాపీనెస్ రానుందని తెలిపారు.

రెడియేషన్ తక్కువే
డబ్యుహెచ్వో ప్రతిపాదించన దాని కన్నా 5జీ రెడియేషన్ చాలా తక్కువగా ఉందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
4జీ కన్నా 5జీ వేగం చాలా ఎక్కువ అని ఇదివరకు చాలా సందర్భాల్లో తెలిపారు. వైఫై కన్నా వేగంగా స్పీడ్ ఉంటుందని టెస్ట్ చేసిన సందర్భంలో నిపుణులు తెలిపారు.












Click it and Unblock the Notifications