Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Jobs for land case: లాలూ ప్రసాద్ యాదవ్‌ను 9 గంటలపాటు విచారించిన ఈడీ

పాట్నా: బీహార్ రాష్ట్రం​లో జరిగిన 'ల్యాండ్ ఫర్ జాబ్' మనీలాండరింగ్​ కుంభకోణంలో విచారణకు హాజరైన ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌​ను ఎన్‌ఫోర్స్‌మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) సుదీర్ఘంగా విచారించింది. సుమారు 9 గంటలకుపైగా ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్​ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు, లాలూ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

సోమవారం ఉదయం 11:00 గంటల ప్రాంతంలో విచారణ కోసం పాట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూ రాత్రి 8:50 గంటలకు బయటకు వచ్చారు. ఈ సమయంలో ఆయనతో కుమార్తె మిసా భారతి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.

Jobs for land case: ED questioning with lalu prasad yadav ends after 9 hours

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఆదివారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుసటిరోజే ఈ పరిణామం జరగడం వల్ల అక్కడి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగా లేకున్నా.. కేంద్రం వేధింపులు ఆగడం లేదని ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు.

లాలూ ప్రసాద్​ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను ఇన్ని గంటలపాటు విచారించకుండా ఉండాల్సింది. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు అని ఆర్జేడీ నేత లలిత్​ యాదవ్​ అన్నారు. ఆర్జేడీ మహిళానేత ఎజ్యా యాదవ్​ మాట్లాడుతూ.. ఈడీ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం చేప్పినట్లుగా వ్యవహరిస్తోందని, ఈడీ అనేది ప్రస్తుతం ఒక జోక్​‌గా మారిందని ధ్వజమెత్తారు. అయితే ఈడీ సొంతంగా పనిచేస్తే లాలూపై ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కాదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+