రూటు మార్చిన కమల్ హాసన్, జయ సమాధి దగ్గర, హీరో అజిత్ దంపతులు, ఏడాదిలో !
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద నిత్యం విమర్శలు చేస్తున్న బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ మంగళవారం ఒక్క సారిగా రూటు మార్చారు. జయలలిత మరణించి ఒక ఏడాది పూర్తి అయినా ఇంత వరకు కమల్ హాసన్ అమ్మకు ఒక్కసారికూడా నివాళి అర్పించలేదు.
మంగళవారం రూటు మార్చిన కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చెయ్యకుండా అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. మంగళవారం మెరీనా బీచ్ దగ్గరకు కమల్ హాసన్ చేరుకున్నారు.

కమల్ హాసన్ తో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో మెరీనా బీచ్ చేరుకుని జయలలితకు నివాళి అర్పించారు. ఈ సందర్బంలో మీడియాతో మాట్లాడటానికి హీరో కమల్ హాసన్ నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

జయలలిత మరణించిన తరువాత అప్పట్లో అమ్మ వారసుడు ప్రముఖ హీరో అజిత్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే చివరికి అజిత్ తాను రాజకీయాల్లోకి రాను అని తేల్చి చెప్పాడు. మంగళవారం అజిత్ తన భార్య షాలినితో కలిసి మెరీనా బీచ్ లోని అమ్మ సమాధి దగ్గరకు చేరుకుని నివాళి అర్పించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications