పూర్తైన కంచి పీఠాధిపతి మహ సమాధి
Recommended Video
చెన్నై:కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేశారు. మహాభిషేకం అనంతరం మంత్రోచ్ఛరణల మధ్య గురువారం నాడు బృందావన ప్రవేశం చేశారు.
శివైక్యం చెందిన కంచి పీఠాధిపతి లిఖిన్ని భక్త్య శిష్యకోటి వేదమంత్రాల మధ్య జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం చేశారు.
సరస్వతి పార్థివదేహానికి వేదపండితులు మహాభిషేకం నిర్వహించారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి బృందావనం పక్కనే మహాసమాధి చేశారు. స్వామిని కడసారి దర్శనం కోసం భారీగా భక్తులు మఠానికి వచ్చారు.
కొంతకాలంగా రక్తపోటు, తీవ్ర మధుమేహం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు కన్నమూశారు. రోజూలాగానే బుధవారం ఉదయం కూడా 7.10 గంటల వరకూ భక్తులకు దర్శనమిచ్చారు. అయితే వెంటనే అస్వస్థతకు గురయ్యారు. బాత్రూమ్కు వెళ్లి అక్కడే స్పృహతప్పి పడిపోయారు. సేవకులు స్వామీజీని సమీపంలోని ఏబీసీ హాస్పిటల్కు తరలించారు.
వైద్యులు ఆయనకు స్వస్థత చేకూర్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జయేంద్ర సరస్వతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.గురువారం ఉదయం నుండి జయేంద్ర సరస్వతి మహసమాధి ప్రవేశం చేశారు