కుప్పకూలిన నటి, ఆసుపత్రిలో చికిత్స, మళ్లీ పోలీస్ స్టేషన్ కు రావాల్సిందే మేడమ్ !
రేణుకాస్వామి హత్యకేసులో నిందితురాలు పవిత్ర గౌడ పోలీస్ స్టేషన్లో అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసు విచారణ సందర్భంగా పవిత్ర గౌడ అస్వస్థతకు గురికావడంతో మంగళవారం సాయంత్రం బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్కు వైద్యులను పిలిపించారు. పవిత్ర గౌడ్ను పరీక్షించిన వైద్యులు తదుపరి చికిత్స నిమిత్తం పవిత్ర గౌడను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
పవిత్ర గౌడ ఆరోగ్యం గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది. పవిత్ర గౌడ్: రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితురాలు అని పోలీసులు అంటున్నారు. పవిత్ర గౌడ అస్వస్థతకు గురి కావడంతో మీరో దర్శన్ తో పాటు సాటి నిందితులు హడలిపోయారని తెలిసింది. తరువాత నటి పవిత్ర గౌడను ఆసుపత్రికి తరలించారని సమాచారం. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ అరెస్టయి అయ్యి వారం రోజులకు పైగా అయ్యింది.

ప్రస్తుతం నటి పవిత్ర గౌడ పోలీసు కస్టడీలో ఉండటంతో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. రాత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్రంలో ఉన్న పవిత్ర గౌడ్ ను మంగళవారం ఉదయం మళ్లీ స్టేషన్ కు పిలిపించి విచారించారు. పోలీస్ స్టేషన్లో భోజనం చేసేందుకు పవిత్ర గౌడ నిరాకరించినట్లు సమాచారం. పోలీసు కస్టడీలో సరిగ్గా భోజనం చేయకపోవడంతో పవిత్ర గౌడ అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
ఈరోజు మద్యాహ్నం కూడా పవిత్ర గౌడ భోజనం చేయలేదని తెలిసింది. దీంతో విచారణ సమయంలో పవిత్ర గౌడ కుప్పకూలినట్లు పోలీసులు చెబుతున్నారు. వెంటనే డాక్టర్ను పిలిపించి చికిత్స చేయగా భోజనం మానేసి అస్వస్థతకు గురయ్యిందని డాక్టర్ తెలిపారు. అస్వస్థతకు గురైన పవిత్ర గౌడ ప్రస్తుతం అంబేద్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం తిరిగి ఆమెను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారిస్తామని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications