బెంగళూరులో ఘోరం: మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ దారుణ హత్య
బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ కన్నడ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
Recommended Video
బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ కన్నడ జర్నలిస్ట్, లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు.
ఆమె నివాసం వద్దే మంగళవారం రాత్రి దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.
స్థానిక రాజరాజేశ్వరి నగర్లోని తన సొంత ఇంటి వద్దే హత్యకు గురైరయ్యారు. ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసి, బయటకు రాగానే కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
కర్ణాటకలోని పలు పత్రికలకు ఆమె వ్యాసాలు రాస్తుంటారు. ధార్వాడ్ బిజెపి ఎంపీ ప్రహ్లాద్ జోషి, మరో బిజెపి నేత ఉమేశ్ ధుషితో ఆమెకు వివాదాలు ఉన్నాయి. 2008 జనవరి 23న ఆమె రాసిన కథనాలపై ఈ ఇద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై పరువునష్టం కేసులు వేశారు.