బెంగాల్, బీహార్లో మతఘర్షణలపై మోడీ-షా మౌనం ఎందుకు ? కపిల్ సిబల్ సూటి ప్రశ్న..
శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో పశ్చిమబెంగాల్, బీహార్ లో తాజాగా చోటు చేసుకున్న ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని పూర్తి స్ధాయిలో నియంత్రించడంలో అక్కడి ప్రభుత్వాలు విఫలవుతున్నాయి. దీనిపై కేంద్రం కూడా మౌనం వహిస్తోందని ఇవాళ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోడీ, అమిత్ షాపై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు.
పశ్చిమ బెంగాల్, బీహార్లో మత ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండిపోవడాన్ని ఎంపీ కపిల్ సిబల్ ఆక్షేపించారు. ఈ ఘర్షణలు 2024 సార్వత్రిక ఎన్నికలకు కారణం కాకూడదన్నారు. హింస, దహనాలు, విద్వేష బీజాలు, రాజకీయ నాయకులకు, రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే మేలు చేకూరుస్తాయని కపిల్ సిబల్ దేశ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ ద్వేషానికి సామాన్యుడు బలి అవుతాడన్నారు.

రెండు రాష్ట్రాల్లో హింసపై ఇప్పటికైనా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడాలని, హింసను అరికట్టాలని కపిల్ సిబల్ కోరారు. ఈ హింసపై వారిద్దరూ మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. వారిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దేశంలో చట్టబద్ధమైన పాలన సాగనివ్వాలని కోరారు. బీహార్లో మత ఘర్షణల ఘటనలపై హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారని, పరిస్థితిని సమీక్షించేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో మాట్లాడారని
కానీ, దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని కపిల్ సిబల్ అన్నారు.
రామనవమి ఉత్సవాల సందర్భంగా బీహార్లోని ససారం, బీహార్ షరీఫ్ పట్టణాల్లో మతపరమైన హింస చెలరేగింది. ససారం, బీహార్ షరీఫ్లలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు శనివారం వరకు 45 మందిని అరెస్టు చేశారు. రెండు పట్టణాలలో జరిగన ఘర్షణల్లో వాహనాలు, ఇళ్ళు, దుకాణాలు తగలబడ్డాయి, అనేక మంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్లోని హౌరాలోని శిబ్పూర్ మరియు కాజీపరా ప్రాంతంలో కూడా రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications