కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ కు 49 శాతం ఓట్లు, బీజేపీ, జేడీఎస్ అంతే: సర్వే!
Recommended Video

బెంగళూరు: కర్ణాటకలో 2018లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే తెలిపింది. రెండువ స్థానంలో ఉన్న బీజేపీకి 27 శాతం ఓట్లు, ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ మూడుస్థానికి పరిమితం అయ్యి 20 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని సర్వేలో వెలుగు చూసింది.

మూడ్ ఆఫ్ ది నేషన్
‘మూడ్ ఆఫ్ ది నేషన్ 'పేరుతో కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో లోక్ నీతి జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ సందీప్ శాస్త్రీ ఆధ్వర్యంలో కర్ణాటక ప్రభుత్వం పనితీరుపై సర్వే చేశారు. డాక్టర్ సందీప్ శాస్త్రీ బెంగళూరులోని జైన్ డీమ్డ్ యూనివర్శిటి వైస్ చాన్స్ లర్ గా పని చేస్తున్నారు.

బెంగళూరులో అసంతృప్తి
కాంగ్రెస్ ప్రభుత్వం మీద బెంగళూరు నగరంలోని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో 55 శాతం మంది సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని చెప్పారని సర్వే వివరించింది. 11 శాతం మంతి కాంగ్రెస్ పార్టీ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన వారు పర్వాలేదు అని అన్నారని సర్వే చెప్పింది.

చిన్న పట్టణాలు, గ్రామాలు!
చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఎక్కవ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ముఖ్యంగా మైనారిటీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని సర్వే చెప్పింది.

సర్వే ప్రకారం!
లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే ప్రకారం కర్ణాటకలో 11 శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 46 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 33 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 6 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, 4 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారని సర్వే తెలిపింది.

నగరాల్లో కాంగ్రెస్ కు!
బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని నగరాల్లో కాంగ్రెస్ పార్టీకి అంతగా మద్దతు లేదని వెలుగు చూసింది. 9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, 59 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 19 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 9 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, మిగిలిన వారు ఏమీ చెప్పలేమని సర్వేలో వెలుగు చూసింది.

మైనారిటీల మద్దతు?
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మైనారిటీలు భారీ మద్దతు ప్రకటిస్తున్నారని సర్వేలో వెలుగు చూసింది. 14 శాతం మంది పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 49 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 25 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 6 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, మిగిలిన వారు ఏమీ చెప్పలేమని అన్నారని సర్వే తెలిపింది.

ఎస్సీ, ఎస్టీల మద్దతు!
కర్ణాటకలోని ఎస్సీ, ఎస్టీల మద్దతు కాంగ్రెస్ పార్టీకే అంటున్నారని సర్వే చెప్పింది. 12 శాతం మంది పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 51 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 32 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 2 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, 3 శాతం మంది ఏమీ చెప్పలేమని సర్వే తెలిపింది.

దక్షిణ కర్ణాటకలో జై
దక్షిణ కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతు ఉందని సర్వే వివరించింది. 9 శాతం మంది పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 71 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 14 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 4 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, 2 శాతం మంది ఏమీ చెప్పలేమని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే తెలిపింది.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications