కర్ణాటకలో విన్నర్ ఎవరు ?, రన్నర్ ఎవరు ?, కింగ్ మేకర్ ఎవరు ?, లింగాయత్ ఓట్లు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంలో అనేక సర్వేల ఫలితాలు విడుదల అవుతున్నాయి. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్లు మాట్లాడుకోవడానికి నోటినిండా పనిపడుతోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?, ఎవరు అధికారంలోకి వస్తారు ?, ఎవరు సీఎం అయితే బాగుంటుంది ?, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి అంటూ జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే విడుదల చేసింది.
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని 150 ఎమ్మెల్యే సీట్లు టార్గెట్ పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఈసారి మేమే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు సవాలుగా మారిపోయాయి.

ఇప్పటికే విడుదలైన కొన్ని సర్వేల్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని కలవరపెడుతున్నాయి. అధికార పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొన్ని సర్వేలు తెలిపాయి. ఏం చెయ్యాలి అంటూ బీజేపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు జీన్యూస్-మ్యాట్రిజ్ కలసి కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సర్వే నిర్వహించి ఆ సర్వే ఫలితాలు విడుదల చేసింది.
జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే ఫలితాలతో బీజేపీ నాయకులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వేలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదటి స్థానంలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండో స్థానానికి, జేడీఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయ్యాయని సర్వేలో వెలుగు చూసింది.

జీన్యూస్-మ్యాట్రిజ్ అసెంబ్లీ ఎన్నికల సర్వేలో బీజేపీకి 103 నుంచి 115 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 79 నుంచి 91 స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక కర్ణాటకలో కింగ్ మేకర్ గా ఉన్న జేడీఎస్ పార్టీకి 26 నుంచి 36 సీట్లు వస్తాయని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది.
జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 42 శాతం, కాంగ్రెస్ పార్టీ 40 శాతం, జేడీఎస్ పార్టీ 15 శాతం ఓట్లు సంపాధిస్తుందని వెలుగు చూసింది. కర్ణాటకలో అధిక సంఖ్య జనబా ఉన్న లింగాయత్ వర్గంలో ఓట్లు చీలిపోతాయని వెలుగు చూసింది. 66 శాతం లింగాయత్ లు బీజేపీకి ఓటు వేస్తారని సర్వేలో వెలుగు చూసింది.
16 శాతం లింగాయత్ లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారని, 8 శాతం మంది లింగాయత్ లు జేడీఎస్ కు ఓటు వేస్తారని వెలుగు చూసింది. ఇక ఒక్కలిగుల్లో 52 శాతం జేడీఎస్ పార్టీకి, 28 శాతం మంది కాంగ్రెస్ పార్టీకి, 4 శాతం మంది ఇతరులకు ఓటు వేస్తారని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే తెలిపింది. పలు సంస్థలు పలురకాలుగా సర్వేలు విడుదల చేస్తుండటంతో మే 13వ తేదీన అసలు సినిమా విడుదల అవుతుందని కన్నడిగులు అంటున్నారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications