Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ గాంధీని దేశం నుంచి బహిష్కరించాలి, రెండు దేశాల్లో పౌరసత్వం, ఇస్లామిక్ తో !

బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, యువరాజు రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేసి భారతదేశం నుంచి ఆయన్ను బహిష్కరించాలని కర్ణాటక బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి డిమాండ్ చేశారు. భారతదేశం మీద ఎలాంటి ప్రేమలేని రాహుల్ గాంధీ లాంటి నాయకులు ఈదేశంలో ఉండకూడదని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చలవాది నారాయాణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అభద్రతాభావం సృష్టించి దేశాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే రాహుల్‌గాంధీ ఉద్దేశం అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నానని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నానని చలవాది నారాయణస్వామి అన్నారు.

 bjpmlcchalavadinarayanaswamy

రాహుల్ గాంధీని భారతదేశం నుంచి బహిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాకు తాను లేఖ రాస్తానని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి అన్నారు. రాహుల్ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం (రెండు దేశాల పౌరసత్వం) ఉన్నట్లు తన దగ్గర సమాచారం ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఇప్పటికే చెప్పారని చలవాది నారాయణస్వామి అన్నారు.

దీనిని పరిశీలించి రాహుల్ గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని చలవాది నారాయణస్వామి డిమాండ్ చేశారు. రెండు దేశాల పౌరసత్వాలు ఉన్న వారిని కూడా ఈ దేశం నుంచి బహిష్కరిస్తే బాగుంటుందని చలవాది నారాయణ స్వామి అన్నారు. లేకుంటే దేశంలో అభద్రతా భావానికి సంబంధించిన అన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని చలవాది నారాయణస్వామి అనుమానం వ్యక్తం చేశారు.

మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత రాహుల్ గాంధీ ముత్తాతకు అప్పటి బ్రిటిష్ వారు సెంగోల్ (దండదండ) ఇచ్చారని, ఆ భావజాలం చరిత్రలో మూతపడిందని చలవాది నారాయణస్వామి ఆరోపించారు. ముత్తాత అడుగుజాడల్లో నడుస్తున్న రాహుల్ గాంధీ తలలో భారత వ్యతిరేక వైఖరి ఉన్నట్లు స్పష్టమవుతోందని చలవాది నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 rahul

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారని, అక్కడికి వెళ్లి దేశంలో అభద్రతాభావం సృష్టించే ప్రకటనలు చేస్తున్నారని, ఆయనకు ఎప్పుడూ భారత్ అనుకూల మనస్తత్వం లేదేమోనన్న అనుమానం కలుగుతోందని చలవాది నారాయణస్వామి ఆరోపించారు. 18 ఇస్లామిక్ సంస్థల అధినేతలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నట్టు తనకు సమాచారం ఉందని చలవాది నారాయణస్వామి ఆరోపించారు.

రాహుల్ గాంధీ ద్వారా భారత్‌లో అభద్రతాభావం నెలకొల్పే ప్లాన్‌లో ఉందన్న విషయం బయటకు వస్తోందని చలవాది నారాయణస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ మూడ్ ఇంతలా మారడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. విపక్షాలన్నింటినీ ఆహ్వానించినా వారు రాలేదు. ఇది నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉన్మాదమని, దీనిపై రాహుల్ గాంధీ మోదీకి వ్యతిరేకంగా విదేశాల్లో మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల గురించి అడగడానికి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదని, ఈ హామీలకు మేము వ్యతిరేకం. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నా కుటుంబం తీసుకోదని చలవాది నారాయణస్వామి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే అప్పుడు మాట్లాడతానని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+