కావేరీ నీరు పంపిణిపై సీఎం సిద్దూ ఏమన్నారంటే, సుప్రీం కోర్టు తీర్పు హైలెట్స్ ఇవే!
Recommended Video

బెంగళూరు: కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మొదటి సారి స్పంధించారు. బెంగళూరులో అధికారిక నివాసం కృష్ణాలో మీడియాతో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య సుప్రీం కోర్టు తీర్పుతో కర్ణాటకకు అదనంగా 14.75 టీసీఎంసీల నీరు మిగిలిందని అన్నారు.
కావేరీ జలాల పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కర్ణాటకకు అనుకూలంగా ఉందని సీఎం సిద్దరామయ్య చెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బయలుదేరిన సీఎం సిద్దరాయ్య సుప్రీం కోర్టు ఆదేశాల తీర్పును పూర్తిగా పరిశీలించిన తరువాత మీడియాతో మాట్లాడుతానని అన్నారు.
కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు హైలెట్స్
* తమళనాడుకు ప్రతి సంవత్సరం 177 టీఎంసీల నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చెయ్యాలి
* కర్ణాటకకు 14.75 టీఎంసీల నీరు అదనంగా ఇవ్వడానికి సుప్రీం కోర్టు అంగీకారం
* కర్ణాటకలో సాగునీటి వ్యవసాయం అభివృద్ది చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన సుప్రీం కోర్టు
* బెంగళూరు నగరానికి అదనంగా కావేరీ నీరు కేటాయించడానికి అంగీకరించిన సుప్రీం కోర్టు
* కావేరీ నిర్వహణా మండలి ఏర్పాటు చెయ్యడం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం
* 15 ఏళ్లపాటు తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు.












Click it and Unblock the Notifications