రూ. 6 కోట్ల కొత్త నోట్లు, 7 కిలోల బంగారు: తేలీదు, సీఎం
బెంగళూరులో ఐటీ అధికారుల దాడుల్లో చిక్కిన రూ. 4.70 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మైసూరు, తమిళనాడులోని ఈరోడ్, బెంగళూరులోని బ్యాంకుల్లో డ్రా చేశారని వెలుగు చూసింది.
బెంగళూరు/బెళగావి: బెంగళూరు నగరంలో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల దాడిలో చిక్కిన రూ. 4.70 కోట్ల కొత్త నోట్లతో సహ రూ. 6 కోట్లు, 7 కిలోల బంగారు బిస్కెట్లు, నగలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ? ఎవరు తెచ్చారు ? ఎలా వచ్చింది ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆప్తులైన కావేరీ జలమండలి ఎండీ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్రలను శుక్రవారం వేకువ జామున వరకు ఐటీ అధికారులు విచారించారు.
అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు ఏ బ్యాంకు నుంచి తీసుకు వచ్చారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. అయితే విశ్వసననీయ సమాచారం మేరకు మైసూరు. తమిళనాడులోని ఈరోడ్ లో ఉన్న బ్యాంకుల నుంచి రూ. 2,000 నోట్లు డ్రా చేశారని వెలుగు చూసింది. బెంగళూరులోని ఓ బ్యాంకులో కూడా నగదు డ్రా చేశారని ఐటీ అధికారులు గుర్తించారు.

మాకు సంబంధం లేదు: సీఎం సిద్దరామయ్య
బెళగావిలో జరుగుతున్న శీతలకాల సమావేశాలలో బీజేపీ నాయకులు బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల విషయంలో సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీని గట్టిగా నిలదీశారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ నాయకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ కావేరీ జలమండలి ఎండీ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్రలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

బీజేపీ కావాలనే ఆ ఇద్దరు అధికారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి రాద్దాంతం చేస్తున్నదని ఆరోపించారు. అయితే ఐటీ అధికారుల దాడుల కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష పార్టీ బీజేపీ పట్టుబడుతున్నది.
విషయం తెలుసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం బెంగళూరు చేరుకుని ఈ అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications