సీఎం ఎన్ని వేల కోట్లు లూటీ చేశారంటే ?, సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలనం, ధైర్యం ఉంటే ?
బెంగళూరు/హావేరి: అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నాయకులు సొంత పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరు ఓలేకార్ కు మరోసారి పోటీ చేసే చాన్స్ ఇవ్వకపోవడంతో ఆయన ఏకంగా సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నీటిపారుదల శాఖకు చెందిన రూ. 1,500 కోట్లు డబ్బులు లూటీ చేసి ఆయన జోబులోకి వేసుకున్నారని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరూ ఓలేకార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే నెహరు ఓలేకార్ ఆరోపణలను హైలెట్ చేసిన జేడీఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో లబ్దిపొందడానికి ప్రయత్నిస్తున్నది.

బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరూ ఓలేకార్ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద చేసిన ఆరోపణలను జేడీఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ పోస్టు చేసి దానిని వైరల్ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే నెహరు ఓలేకార్ ఆరోపణలు పరిశీలిస్తే సీఎం బసవరాజ్ బోమ్మయ్ 40 శాతం కమీషన్ సీఎం కాదని, ఆయన 99 శాతం కమీషన్ సీఎం అని అర్థం అవుతోందని జేడీఎస్ పార్టీ ఆరోపించింది.
అసెంబ్లీ ఎన్నికల ముసుగులో పదేపదే కర్ణాటకకు వస్తున్న బీజేపీ హైకమాండ్ నాయకులు ఇక్కడి 40 శాతం కమీషన్ తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న మూటలు మూటలు డబ్బులు ఎత్తుకుని వెళ్లి ఢిల్లీలోని బీజేపీ ఖజానా నింపుకుంటున్నదని జేడీఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. తనకు ఎమ్మెల్యే సీటు రాకపోవడానికి సీఎం బసవరాజ్ ప్రధాన కారణం అని సిట్టింగ్ ఎమ్మెల్యే నెహరూ ఓలేకార్ ఏకవచనంతో సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద ఆరోపణలు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలపై సీఎం బసవరాజ్ బోమ్మయ్ స్పందించారు. తన మీద లేనిపోని ఆరోపణలు చెయ్యడం సరికాదని, తాను రూ. 1,500 కోట్లు లూటీ చేశానని మీ దగ్గర సాక్షాలు ఉంటే వాటిని బయటపెట్టాలని నెహరూ ఓలేకార్ కు సవాలు చేశారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఎవరు ఎంత లూటీ చేశారో అంతా బయటకు వస్తుందని జేడీఎస్ పార్టీ నాయకులు అంటున్నారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications