బహిరంగసభలోనే సీఎం సిద్దరామయ్య కునికిపాట్లు
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ద రామయ్య బహిరంగసభలో నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగసభల్లో సిద్దరామయ్య నిద్రపోతూ కన్పిస్తున్నారు. తాజాగా గుల్బర్గాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో సిద్దరామయ్య నిద్రపోతూ మీడియా కంటికి చిక్కారు.
ఎన్నికల ప్రచారంలో సిద్దరామయ్య బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో బహిరంగసభల్లో తీరిక దొరికితే చాలు కునుకు తీస్తున్నారు. గుల్బర్గా సభలో కూడ సిద్దరామయ్య నిద్రలోకి జారుకొన్నారు. అయితే ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకుడు వెంటనే సిద్దరామయ్యను నిద్ర లేపారు.

అయితే నిద్ర నుండి మేల్కోన్న సిద్దరామయ్య తిరిగి నిద్రపోయారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికలను కాంగ్రెస్, బిజెపిలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీ బిజిగా పర్యటిస్తున్న సిద్ద రామయ్య సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ సభల్లోనే కునికిపాట్లు పడుతున్నారని పలువురు భావిస్తున్నారు.అయితే పార్టీ ప్రచార సభ వేదికల్లోనే సిద్దరామయ్య నిద్ర పోతున్న వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారడం గమనార్హం.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications