డీకే శివకుమార్ vs సిద్ధరామయ్య: ఎవరి బలమెంత?
DK Shivakumar vs Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్లో రాజకీయ పోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న పోరాటం ఆగేలా కనిపించడం లేదు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలు తమ తమ వాదనలను వినిపిస్తున్నాయి. అధిష్ఠానం చెప్పిందే తమకు అంగీకారమని ఇద్దరు నాయకులు కూడా చెప్పారు. అయితే ఈ రెండు వర్గాలలో ఎవరి బలం ఎక్కువ అనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
ఆయన వైపే మొగ్గు చూపుతున్న సీఎం సీటు
ప్రస్తుతానికి సీఎం సిద్ధరామయ్య పదవికి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. కర్ణాటక రాష్టంలో ఓబీసీలదే రాజ్యమని కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలుసని నివేదికలు చెబుతున్నాయి ఆయనకు అహింద వర్గంతో పాటు పార్టీలోని 100 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సభలో మొత్తం 137 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య అంగీకారం లేకుండా ముఖ్యమంత్రిని మార్చడం అనేది చాలా కష్టం.

కాంగ్రెస్కు హెచ్చరిక
కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల సమాఖ్య (KSFBCC) కాంగ్రెస్ను హెచ్చరించింది. రాష్ట్ర యూనిట్లో అంతర్గత కలహాల నేపథ్యంలో సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించడానికి ఏ ప్రయత్నం చేసినా అది పార్టీపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటక రాష్ట్ర వొక్కలిగ సంఘం కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్కు అన్యాయం జరిగితే.. వారు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తారని హెచ్చరించింది.
జి.పరమేశ్వర్ పేరును ముందుకు తెచ్చే అవకాశం
ముఖ్యమంత్రిని మార్చాలని సిద్ధరామయ్య వర్గంపై ఒత్తిడి తెస్తే వారు అధిష్ఠానానికి పేర్ల జాబితాను సమర్పిస్తారని గత కొద్ది రోజులుగా మీడియా నివేదికలలో వెల్లడైంది. ఇందులో ఓ ప్రత్యామ్నాయంగా హోంమంత్రి జి.పరమేశ్వర్ పేరు ఉండవచ్చు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సిద్ధరామయ్య వర్గం ఏ పరిస్థితులలోనూ డీకే శివకుమార్ను తమ బాస్గా అంగీకరించడానికి సిద్ధంగా లేదు.
వొక్కలిగ మఠం నుంచి డీకే శివకుమార్ను సీఎం చేయాలనే డిమాండ్
వీటన్నింటి మధ్య వొక్కలిగ వర్గానికి చెందిన ప్రముఖ మఠం ఆదిచుంచనగిరి మఠం రంగంలోకి దిగింది. ఆదిచుంచనగిరి మఠం ప్రధాన పూజారి నిర్మలానంద నాథ స్వామి మాట్లాడుతూ.. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రాష్ట్ర అత్యున్నత పదవిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వానికి ఆయన అల్టిమేటం కూడా ఇచ్చారు. టీవీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తాను నిరంతరం చూస్తున్నానని ఆయన అన్నారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications