కర్ణాటక ఫలితాలు: అతిపెద్ద పార్టీగా బీజేపీ, తగ్గిన కాంగ్రెస్, జేడీఎస్కు పెరగలేదు
బెంగళూరు: దేశం మొత్తం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ గవర్నర్ను కలిశారు.
బీజేపీ: గెలుపు: 104
కాంగ్రెస్: గెలుపు: 078
జేడీఎస్: గెలుపు: 038
ఇతరులు: గెలుపు: 002
కాగా, 2019లో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత నెలకొంది. అందుకే భారతీయ జనతా పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కూడా తీవ్రంగా గెలుపు కోసం ప్రయత్నాలు చేశాయి.
Recommended Video


కర్ణాటకలోని 222 అసెంబ్లీ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగ్గా.. నేడు ఫలితాలు వెలువడ్డాయి. లెక్కింపు కోసం 38 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.













Click it and Unblock the Notifications