రాష్ట్రాన్ని అమ్మేస్తారా సీఎం గారు, మాజీ సీఎం అభ్యంతరం, తుగ్లక్ పాలన, కంపెనీ పేర్లు !
బెంగళూరు: ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కర్ణాటక రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారా ? అంటూ జేడీఎస్ పార్టీ ప్రశ్నించింది. ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తీరు చూస్తుంటే తనకు తుగ్లక్ పాలన గుర్తుకు వస్తోందని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మండిపడుతున్నారు.
వరద భాదితులను ఆదుకోవడానికి రూ. 10 కోట్లు, అంత కంటే ఎక్కువ విరాలు ఇచ్చే వ్యక్తుల పేర్లు లేదా కంపెనీల పేర్లు అభివృద్ది చేస్తున్న గ్రామాలకు పెడుతామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు. ఈ విషయంపై జేడీఎస్ పార్టీ సోషల్ మీడియాలో సీఎం యడియూరప్ప తీరును తప్పుపడుతూ ట్వీట్ చేసింది.

జేడీఎస్ పార్టీ ట్వీట్ కు మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలోని ప్రతి గ్రామం పేరుకు, అక్కడి ప్రజలకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి గుర్తు చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలు సీఎం యడియూరప్ప తీసుకున్న నిర్ణయాలతో వారి గ్రామాల పేర్లను పోగొట్టుకునే అవకాశం ఉందని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. కర్ణాటకను విక్రయానికి పెట్టి ప్రజల మనోభావాలతో ఆడుకోరాదని జేడీఎస్ పార్టీ సూచించింది.
వరద భాదితులను ఆదుకునే విషయంలో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సమావేశంలో సుమారు 60 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వరద భాదితులను ఆదుకునే దాతలు లేదా వారి కంపెనీల పేరల్లను అభివృద్ది చేస్తున్న గ్రామాలకు పెడుతామని ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప చెప్పారు. సమావేశంలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు వరద భాదితునుల ఆదుకోవడానికి సహాయం చేస్తామని సీఎం యడియూరప్పకు హామీ ఇచ్చారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications