Order: సీఎం సంచలన నిర్ణయం, 22 కార్పోరేషన్లు, బోర్డు అధ్యక్ష పదవులు, చైర్మన్ పదవులు రద్దు !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఇంతకాలం అనుభవిస్తున్న వివిద బోర్డుల చైర్మన్ పదవులు, వైస్ చైర్మన్ పదవులు, పలు కార్పోరేషన్ అధ్యక్ష పదవులను రద్దు చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఆదేశాలు జారీ చేశారు.
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కార్పోరేషన్లు, పలు బోర్డుల అధ్యక్ష పదవులు, చైర్మన్ పదవులు అప్పగించారు. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీజేపీ సీనియర్ నాయకులకు కార్పోరేషన్, బోర్డు అధ్యక్ష పదవులు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా 22 కార్పోరేషన్, బోర్డు అధ్యక్ష పదువులు రద్దు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

అటవి శాఖ, ఐటీ శాఖ, రవాణా శాఖ, పట్టణ, నగరాభివృద్ది శాఖ, ఇందన శాఖ, పరిపాలన తదితర 22 కార్పోరేషన్లు, బోర్డుల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను వెంటనే రద్దు చెయ్యాలని సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆదేశాలు జారీ చేశారని, ఇప్పటి నుంచి ఆ ఆదేశాలు అమలులో ఉంటాయని కర్ణాటక సీఎం ప్రధాన కార్యదర్శి ఎం. ఉమేష్ శాస్త్రీ ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే బోర్డు, కార్పోరేషన్ పదవులు అప్పగించి 18 నెలల పూర్తి కావడం, మంత్రి పదవులు రాని నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలు, పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న నాయకులు బోర్డు, కార్పోరేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు, కోర్ కమిటీ పదవులు అప్పగించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ నిర్ణయించారని తెలిసింది.












Click it and Unblock the Notifications