మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి బిగ్ రిలీఫ్, ఆంబిడెంట్ చీటింగ్ కేసు: హై కోర్టు ఆదేశం!
బెంగళూరు: ఆంబిడెంట్ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు. ఎక్కడ బెంగళూరు సీసీబీ పోలీసులతో తనకు సమస్యలు ఎదురౌతాయో అంటు ఆందోళన చెందుతున్న గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు రిలాక్స్ అయ్యారు.
కక్షసాధింపులో భాగంగా తమ మీద ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసు నమోదు చేశారని, ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలని మనవి చేస్తూ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ కర్ణాటక హై కోర్టులో అర్జీ సమర్పించారు.

అర్జీ విచారణ చేసిన కర్ణాటక హై కోర్టు డిసెంబర్ 4వ తేది (మంగళవారం) వరకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మంగళవారం మళ్లీ అర్జీ విచారణకు వచ్చింది.
తాము ఆదేశాలు జారీ చేసే వరకు గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదని మంగళవారం ఆదేశాలు జారీ చేసిన హై కోర్టు విచారణ వాయిదా వేసింది. హై కోర్టు ఆదేశాలతో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుడు ఆలీఖాన్ తాత్కాలికంగా ఊపిరిపీల్చుకున్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications