నరహంతకుడు, కోర్టు ఆవరణంలోనే కాల్పులు, రెండు రాష్ట్రల్లో అనేక హత్యలు, చివరికి ?
కర్ణాటక, మహారాష్ట్రలో అనేక హత్యలు, లూటీలు చేశాడని కేసులు నమోదు అయిన వ్యక్తిని కోర్టు ఆవరణంలో హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలోని విజయపురలో జరిగింది.
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రలో అనేక హత్యలు, లూటీలు చేశాడని కేసులు నమోదు అయిన వ్యక్తిని కోర్టు ఆవరణంలో హత్య చెయ్యడానికి ప్రయత్నించిన ఘటన కర్ణాటకలోని విజయపురలో జరిగింది. భీమాతీరంలో నరహంతకుడిగా పేరుపొందిన బాగప్ప హరిజన్ మృత్యువుతో పోరాడుతున్నాడు.
భీమాతీరం, కలబురగి, విజయపుర, మహారాష్ట్రలో అనేక హత్యలు చేశాడని బాగప్ప మీద ఇప్పటికే 10 కేసులు నమోదు అయ్యాయి. జైలు శిక్ష అనుభవించిన బాగప్ప జామీను మీద బయటకు వచ్చాడు. న్యాయస్థానంలో ఇతని మీద అనేక కేసులు విచారణలో ఉన్నాయి.

ఓ కేసు విచారణ కోసం మంగళవారం (ఆగస్టు 8వ తేదీ) బాగప్ప తన అనుచరులతో కలిసి విజయపుర కోర్టుకు వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియన వ్యక్తులు రివాల్వర్లతో బాగప్ప మీద కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు బాగప్ప వెన్నులో దూసుకుపోవడంతో కుప్పకూలిపోయాడు.
కోర్టు ఆవరణంలో కాల్పులు జరగడంతో అక్కడ ఉన్న న్యాయవాదులు, కక్షిదారులు పరుగు తీశారు. తీవ్రగాయాలైన బాగప్పను ఆసుపత్రికి తరలించడంతో అతను మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు చెప్పారు. పాతకక్షల కారణంగా బాగప్ప మీద కాల్పులు జరిపిఉంటారని, విచారణ చేస్తున్నామని విజయపుర పోలీసులు తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications