Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మంత్రి దోషి, హైకోర్టు ఆదేశాలు లెక్కలేదా, మాట వినకుంటే జైలుకు, ఏ కేసులో అంటే!

చెక్ బౌన్స్ కేసులో కర్ణాటక పాఠశాల విద్యా శాఖా మంత్రి మధు బంగారప్పను బెంగళూరు కోర్టు దోషిగా నిర్ధారించింది. ఎంపీలు, శాసనసభ్యులకు సంబంధించిన కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు కర్ణాటక రాష్ట్ర మంత్రి మధు బంగారప్పకు ఫిర్యాదుదారుడికి రూ. 6.96 కోట్లు చెల్లించాలని, రూ.10,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

డబ్బు చెల్లించని పక్షంలో మంత్రి మధు బంగారప్ప 6 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిర్యాదులో, ఆకాష్ ఆడియో-వీడియో ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్‌బి మధు చంద్ర (ఎస్ మధు బంగారప్ప) రెండవ నిందితుడిగా ఉండగా, ఆకాష్ ఆడియో, వీడియో కంపెనీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కేసు విచారణ చేసిన ప్రత్యేక కోర్టు మంత్రి మధు బంగారప్పను దోషిగా తేల్చింది.

Karnataka special court convicts Madhu Bangarappa in check bounce case

జరిమానా చెల్లించడంలో విఫలమైతే, నిందితులు బాధ్యత వహిస్తారు. ఆరు నెలల పాటు సాధారణ జైలుశిక్ష పడుతుందని కోర్టు పేర్కొంది. కేసును ఇంతకాలం లాగినందుకు మంత్రి మధు బంగారప్ప తీరును కోర్టు తన తీర్పులో మందలించింది. నిందితుడు కర్ణాటక రాష్ట్ర శాసనసభలో బాధ్యతాయుతమైన పదవిని కలిగి ఉన్న శాసనసభ్యుడు అయినప్పటికీ, XV ACMM యొక్క ఉత్తర్వు పేర్కొన్న కోర్టు ముందు నిందితుడు సురక్షితంగా లేడని చూపిస్తుందని, అది డిక్లరేషన్ జారీ చేసేంత వరకు వెళ్ళిందని కోర్టు చెప్పింది.

నిందితులు విచారణను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది ఆమోదయోగ్యం కాదని కోర్టు తీర్పులో పేర్కొంది. ఫిర్యాదుదారు ప్రకారం ఆకాష్ ఆడియో, వీడియో సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ నుండి రూ. 6 కోట్ల ఇంటర్-కార్పోరేట్ డిపాజిట్ పొందింది. మధు బంగారప్ప రూ.6. 6 కోట్ల చెక్కును జారీ చేసినా అది 2011 నవంబర్ 27వ తేదీన బౌన్స్ అయింది. చెక్కు మొత్తం పరిహారం రికవరీ చేయాలని 2012లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కోర్టును ఆశ్రయించింది.

Karnataka special court convicts Madhu Bangarappa in check bounce case

2022లో కేసు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయబడింది. ఈ కేసును రద్దు చేయాలని మధు బంగారప్ప హైకోర్టును ఆశ్రయించారు. అయితే అతనికి ఇచ్చిన ఒప్పందం ప్రకారం పూర్తి చెల్లింపు చేయడంలో విఫలమైనందున మధు బంగారప్ప పిటిషన్ 2022లో కొట్టివేయబడింది. రూ. 50 లక్షలు హైకోర్టులో పిటీషన్ ఉండగానే మధు బంగారప్ప చెల్లించారు. మిగిలిన రూ. 6.10 కోట్లను 2023 డిసెంబర్ 26, జనవరి 30వ తేదీ 2024లోగా ప్రత్యేక కోర్టు ముందు చెల్లిస్తానని మళ్లీ హామీ ఇచ్చారు.

అయితే ప్రత్యేక న్యాయస్థానం ఈ మనవిని తిరస్కరించింది. ఎందుకంటే నిందితుడు నెం. 2 కోర్టు ముందు వాయిదాలను దాఖలు చేసే అలవాటు పెట్టుకున్నాడని, కానీ వాటిని అనుసరించడానికి సిద్ధంగా లేడని, గగతంలో కర్ణాటక హైకోర్టు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పాలని, కర్ణాటక హైకోర్టు పిటిషన్ కొట్టివేసిన తరువాత కూడా దాదాపు ఏడాది పాటు విచారణను లాగడానికి ప్రయత్నించారని ప్రత్యేక కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+