ఎలుకలతో పోలుస్తారా, ముక్కు చెవులు కోస్తాం: మంత్రి మహేశ్వరికి కర్ణిసేన హెచ్చరిక
జైపూర్: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి కిరణ్ మహేశ్వరిపై కర్ణిసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమను ఎలుకలతో పోల్చారంటూ మండిపడుతున్నారు. కర్ణిసేన వర్గంకు చెందిన ప్రజలకు మంత్రి తక్షణం క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆమె ముక్కు చెవులు కోస్తామని హెచ్చరించారు.
రాజస్థాన్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సర్వ్రాజ్ పుత్ సమాజ్ సంఘర్ష్ సమితి ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారంపై మంత్రి మహేశ్వరి విమర్శలు చేసే క్రమంలో కొందరిని ఎలుకలతో పోల్చారు. ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ కొంతమంది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రంధ్రాల్లో నుంచి ఎలుకలు బయటకు వచ్చినట్టుగా వస్తారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను ఆ వర్గానికి చెందిన కర్ణిసేన తప్పుబట్టింది. అయితే, దీనిపై సదరు మంత్రి స్పందిస్తూ... కర్ణిసేన వర్గ ప్రజలను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేయలేదన్నారు. కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడానని చెప్పారు. దీంతో కాంగ్రెస్ వారు మండిపడ్డారు. తమను అలా విమర్శిస్తారా అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ నేతలను ఎలుకలతో పోల్చడం ఏమిటని కాంగ్రెస్ చీఫ్ సచిన్ పైలట్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని అతను డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఆమె రాజ్పుత్ ఓట్ల సాయంతో గెలిచారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications