అమ్మ కోసం అపోలోకు కరుణానిధి భార్య..
చెన్నై : గత నెల 27నుంచి ఆసుపత్రికే పరిమితమైపోయిన అమ్మ ఆరోగ్యంపై పలువురు ప్రముఖ నేతలు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాహుల్ గాంధీ, అమిత్ షా లాంటి నేతలు స్వయంగా అపోలో ఆసుపత్రి వద్దకు వెళ్లి మరీ పరామర్శించారు. తాజాగా డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాళ్ అపోలో ఆసుపత్రిని సందర్శించారు.

గురువారం రాత్రి కుమార్తె కనిమొళితో కలిసి అపోలో ఆస్పత్రిని సందర్శించిన రాజాత్తి అమ్మాళ్.. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమ్మ యోగక్షేమాలను దగ్గరుండి పరిశీలిస్తున్న శశికళను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, గతవారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, సీనియర్ నేతలు ఎస్.దురైమురుగన్, కె.పొన్ముడి అపోలోను సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. వెంటిలేటర్ పై చికిత్స పొందుతోన్న జయలలిత కల్లు తెరిచారని వైద్యులు ధ్రువీకరించినట్లుగా వార్తలు రావడంతో.. అమ్మ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అమ్మ కోసం చేస్తోన్న పూజలు ఫలిస్తున్నాయని, అమ్మ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అవుతారని వారంతా ఆకాంక్షిస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications