Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?
తమిళనాడు (tamil nadu) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకో ఎనిమిది రోజుల్లో ప్రచార పర్వం ముగియబోతోంది. దీంతో అన్ని ప్రధాన పార్టీల అభ్యర్దులు నిత్యం జనంలోనే ఉంటూ ర్యాలీలు, సభలు, ఇంటింటి ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ ఇందుకు భిన్నంగా టీవీకే పార్టీ అధినేత అయిన హీరో విజయ్ (vijay)మాత్రం వరుసగా ర్యాలీలు రద్దు చేసుకుంటున్నారు. దీని వెనుక ఏముందనే చర్చ ఇప్పుడు తమిళనాడులో జరుగుతోంది.
తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయ్ ర్యాలీల్ని వరుసగా రద్దు చేస్తూ టీవీకే చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా ప్రచారం చివరి దశలో ఓటర్లను నేరుగా కలుసుకోవడం చాలా కీలకమని కొందరు అందరూ భావిస్తున్నారు. కానీ విజయ్ ఆలోచనలు మరో విదంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మార్చి 15న ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుండి, ఎన్నికల సంఘం నుండి అనుమతి పొందినప్పటికీ విజయ్ పలు ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ ఆకస్మిక రద్దులకు గల స్పష్టమైన కారణాలను పార్టీ అధికారికంగా వెల్లడించలేదు.

అయితే గతేడాది జరిగిన కరూర్ తొక్కిసలాట దుర్ఘటన నేపథ్యంలో విజయ్ బహిరంగ కార్యక్రమాలకు హాజరయ్యే విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఈ తొక్కిసలాట కేసులో ఇప్పటికే సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న విజయ్.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మార్చి 30న తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత విజయ్.. తాను పోటీ చేస్తున్న పెరంబూర్లో, అనంతరం కొలత్తూరులో ప్రచారం చేసినా, పోలీసుల భద్రతా లోపాలను కారణంగా చూపుతూ, విల్లివాక్కంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

ఆ తర్వాత తాను పోటీ చేస్తున్న మరో స్థానమైన తిరుచిరాపల్లి తూర్పులో ఏప్రిల్ 2న ప్రచారం నిర్వహించి, ఏప్రిల్ 4న పుదుచ్చేరిలో పర్యటించారు. ఆ తర్వాత 4 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. సమయ పరిమితులను కారణంగా చూపుతూ, ఏప్రిల్ 6న టి నగర్ , విల్లివాక్కంలో జరగాల్సిన రోడ్షోను కూడా పార్టీ రద్దు చేసింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రచార సమయాన్ని పరిమితం చేస్తున్నారని టీవీకే ఆరోపించింది. విజయ్ ఏప్రిల్ 8న తిరునెల్వేలి, తూత్తుకుడిలో భారీ రోడ్షో నిర్వహించారు. ఆ తర్వాత ఏప్రిల్ 9న కడలూరులో జరగాల్సిన తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. పోలింగ్ జరుగుతున్న పుదుచ్చేరి గుండా 175 కిలోమీటర్ల ప్రయాణం వంటి రవాణాపరమైన సవాళ్లు, ప్రజా భద్రతపై ఆందోళనలే ఈ నిర్ణయం వెనుక కారణాలని వర్గాలు చెబుతున్నాయి. అయితే కరూర్ తొక్కిసలాట ప్రభావం ఉందా లేక బీజేపీ పరోక్షంగా ఆయన్ను ప్రభావితం చేసి ఎన్నికల ప్రచారానికి దూరం చేస్తోందా అన్నది తేలడం లేదు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
ఎంత సీఎం అయినా.. !! -
Tamil Nadu: రాజకీయాల్లో రీటేక్స్ ఉండవు..! విజయ్ కు చిదంబరం కౌంటర్..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!













Click it and Unblock the Notifications