ఏడాది కాలంగా యువతిపై అత్యాచారం..మత మార్పిడి: పోలీస్ కమిషనర్ కు బీజేపీ మహిళా ఎంపీ ఫిర్యాదు.. !
బెంగళూరు: ఓ యువతిపై దారుణంగా ఆకృత్యానికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్నో, మొన్ననో చోటు చేసుకున్న ఘటన కాదు ఇది. ఏడాదికాలంగా ఆ బాలిక వారి చెరలోనే ఉంటోంది. ఈ విషయం తన దృష్టికి రాగానే శరవేగంగా స్పందించారు భారతీయ జనతా పార్టీ మహిళా ఎంపీ. దీనిపై ఆమె పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనికోసం ఆ మహిళా ఎంపీ స్వయంగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రావడం చర్చనీయాంశమైంది.
ఆమే- శోభా కరంద్లాజే. కర్ణాటక బీజేపీ రాష్ట్రశాఖలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాయకురాలు. కర్ణాటకలోని ఉడుపి-చిక్ మగళూరు లోక్ సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆదివారం ఉదయం బెంగళూరు ఇన్ ఫాంట్రీ రోడ్ లో ఉన్న నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ భాస్కర్ రావును కలిశారు. యువతిపై ఏడాదికాలంగా కొనసాగుతున్న అత్యాచార సంఘటనపై లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.

బాధితురాలు కేరళలోని కాసర్ గోడ్ ప్రాంతానికి చెందిన యువతి అని, ప్రేమ పేరుతో ఓ ముస్లిం యువకుడు ఆమెను లోబర్చుకున్నాడని అన్నారు. అనంతరం ఆ యువతిని నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడుతున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాసర్ గోడ్ నుంచి తొలుత మంగళూరుకు, అనంతరం బెంగళూరుకు తీసుకొచ్చాడని చెప్పారు. అతని బారి నుంచి ఆ యువతిని వెంటనే విడిపించాలని కోరారు.
అనంతరం శోభా కరంద్లాజే విలేకరులతో మాట్లాడారు. సెక్యులర్ అని చెప్పుకొంటోన్న కేరళ ప్రభుత్వం.. ఈ ఉదంతంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక వర్గానికి న్యాయం చేయాలనే పేరుతో మెజారిటీ వర్గ ప్రజలను కేరళ ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. కాసర్ గోడ్ యువతిపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను బలవంతంగా మతం మార్చించిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications