లవ్ జిహాద్ కేసు: ఎన్ఐఏ విచారణకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: కేరళలో 'లవ్ జిహాద్' అంశంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విచారణకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నాయకత్వం వహించనున్నారు. కేరళకు చెందిన లవ్ జిహాదీ కేసును తొలిసారిగా సుప్రీంకోర్టు విచారణ చేస్తోంది.
కేరళలో లవ్ జిహాద్ ఘటనలు చాలానే ఉన్నాయని ఎన్ఐఏ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు వెంటనే విచారణకు ఆదేశించింది. కాగా, న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. సదరు అమ్మాయిని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. కేరళ ప్రభుత్వం, ఎన్ఐఏ ఇచ్చే ఆధారాల ఆధారంగానే కేసును పూర్తి విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం వెల్లడించింది.
సదరు అమ్మాయితో న్యాయస్థానం మాట్లాడిన తర్వాతే ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలని న్యాయవాది కపిల్ సిబల్ గత విచారణ సమయంలో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బాధిత యువతిని కోర్టుకు తీసుకురావాలని సూచించింది.

కేరళకు చెందిన ఓ హిందూ యువతి ముస్లిం వ్యక్తిని ప్రేమించి ఇస్లాం మతం స్వీకరించిన తర్వాత అతడిని 2016లో పెళ్లాడింది. ఈ విషయం వివాదాస్పదమైంది.
ఈ వివాహం చెల్లదంటూ కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సదరు బాధితులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
పిటిషనరు తరపున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. వీరి వివాహాన్ని రద్దు చేయడంతో పాటు సదరు మహిళను తన భర్తతో కలిసేందుకు అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇది ఇలా ఉండగా, ఆ మహిళ మతం మార్చుకోవడం, ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న ఘటనలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులే ఇలాంటి మరో ఘటనలోనూ ఉన్నారని తమ దృష్టికి వచ్చినట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఈ విచారణను ఏజెన్సీకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేరళ పోలీసుల తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ వీ గిరి కోర్టుకు స్పష్టంచేశారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications